గ్రాండ్‌ మాస్క్‌ క్రేన్‌ క్రాష్‌: 14 మంది ట్రయల్‌ ప్రారంభం

- August 12, 2016 , by Maagulf
గ్రాండ్‌ మాస్క్‌ క్రేన్‌ క్రాష్‌: 14 మంది ట్రయల్‌ ప్రారంభం

మక్కాలో క్రేన్‌ కూలిన ప్రమాదంలో 11 మంది పిలిగ్రిమ్స్‌ ప్రాణాలు కోల్పోవడం వందలాది మంది గాయాలపాలవడం తెలిసిన విషయమే. ఈ ఘటనకు బాధ్యులుగా 8 దేశాలకు చెందిన 14 మందికి ట్రయల్‌ ప్రారంభమయ్యింది. ఆరుగురు సౌదీలు, ఇద్దరు పాకిస్తానీలు, ఓ కెనడియన్‌, జోర్డానియన్‌, పాలస్తీనియన్‌, ఈజిప్టియన్‌, జిసిసి జాతీయుడు ఒకరు, ఫిలిప్పినో జాతీయుడొకరు ట్రయల్‌లో ఉన్నారనీ, వీరిలో సౌదీకి చెందిన బిలియనీర్‌ కూడా ఉన్నారని తెలియవస్తోంది. అయితే వీరి వివరాలు బహిర్గతం కాలేదు. 1,350 టన్నుల క్రేన్‌ గ్రాండ్‌ మాస్క్‌లో కూలిపోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది. క్రేన్‌ని ఆపరేట్‌ చేస్తున్న కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి చెందిన 170 మంది ఉద్యోగుల్ని ఈ కేసులో ఇప్పటికే విచారించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com