300 మందికి పౌరసత్వం ఇచ్చిన అమిర్ షేక్
- August 12, 2016
అమిర్ షేక్ సబా అల్ అహ్మద్ అల్ బెర్ అల్ సబా, 300 మందికి సిటిజన్షిప్ని మంజూరు చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ వివరాల్ని వెల్లడించింది. కువైటీ విడోలు, డైవోర్సీలకు చెందిన 180 మంది పిల్లలకు, మరో 120 మందికి ఈ పౌరసత్వం అందించినట్లు మినిస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సిటిజన్షిప్ (జిడిసి)ని సందర్శించిన అమిర్ షేక్, ముఖ్యమైన విషయాల్లో సీక్రెసీ తప్పనిసరి అనీ, స్పెషల్ నీడ్స్ కేసుల్లో మానవత్వంతో వ్యవహరించాలని ఆయన సూచించారు. సాద్ అల్ అబ్దుల్లా అకాడమీ ఫర్ సెక్యూరిటీ సైన్సెస్ని ఈ సందర్భంగా పరిశీలించారు మినిస్టర్ షేక్ మొహమ్మద్. అకాడమీ నుంచి రానున్న రోజుల్లో స్పెషలైజ్డ్ స్టడీస్ కోసం విదేశాలకు పంపే ఏర్పాట్లు చేయాలనీ, కోస్ట్ గార్డ్స్, పోలీస్ ఎయిర్ఫోర్స్ విభాగాల్లో ఉపయోగపడే విధంగా వారికి శిక్షణ ఇప్పించాల్సి ఉందని మినిస్టర్ షేక్ మొహమ్మద్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







