300 మందికి పౌరసత్వం ఇచ్చిన అమిర్‌ షేక్‌

- August 12, 2016 , by Maagulf
300 మందికి పౌరసత్వం ఇచ్చిన అమిర్‌ షేక్‌

అమిర్‌ షేక్‌ సబా అల్‌ అహ్మద్‌ అల్‌ బెర్‌ అల్‌ సబా, 300 మందికి సిటిజన్‌షిప్‌ని మంజూరు చేశారు. మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ ఈ వివరాల్ని వెల్లడించింది. కువైటీ విడోలు, డైవోర్సీలకు చెందిన 180 మంది పిల్లలకు, మరో 120 మందికి ఈ పౌరసత్వం అందించినట్లు మినిస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి. జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ సిటిజన్‌షిప్‌ (జిడిసి)ని సందర్శించిన అమిర్‌ షేక్‌, ముఖ్యమైన విషయాల్లో సీక్రెసీ తప్పనిసరి అనీ, స్పెషల్‌ నీడ్స్‌ కేసుల్లో మానవత్వంతో వ్యవహరించాలని ఆయన సూచించారు. సాద్‌ అల్‌ అబ్దుల్లా అకాడమీ ఫర్‌ సెక్యూరిటీ సైన్సెస్‌ని ఈ సందర్భంగా పరిశీలించారు మినిస్టర్‌ షేక్‌ మొహమ్మద్‌. అకాడమీ నుంచి రానున్న రోజుల్లో స్పెషలైజ్డ్‌ స్టడీస్‌ కోసం విదేశాలకు పంపే ఏర్పాట్లు చేయాలనీ, కోస్ట్‌ గార్డ్స్‌, పోలీస్‌ ఎయిర్‌ఫోర్స్‌ విభాగాల్లో ఉపయోగపడే విధంగా వారికి శిక్షణ ఇప్పించాల్సి ఉందని మినిస్టర్‌ షేక్‌ మొహమ్మద్‌ అభిప్రాయపడ్డారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com