క్రీడలమంత్రి విజయ్గోయల్ని హెచ్చరించిన ఒలింపిక్స్ నిర్వాహకులు
- August 12, 2016
క్రీడాకారులను ప్రొత్సహించేందుకు రియోకు వెళ్లిన కేంద్ర క్రీడలమంత్రి విజయ్గోయల్ని ఒలింపిక్స్ నిర్వాహకులు హెచ్చరించారు. ఇంకోసారి అలాంటి పరిస్థితి వస్తే మంత్రి అక్రిడేషన్ను రద్దు చేస్తామని హెచ్చరించారు. ఇంతకీ మంత్రి ఏం చేశారు. విషయం ఏంటంటే.. అక్రిడేషన్ లేని వ్యక్తులను అనుమతి లేని వేదికల వద్దకు మంత్రి తనతో తీసుకొని వెళ్లడమే నిర్వాహకులు ఆగ్రహానికి కారణమైంది. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్తామని అధికారులు చెప్పారు. ఈక్రమంలో ఆయన పక్కనున్న వ్యక్తులు ఒలింపిక్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారని కాంటినెంటల్ మేనేజర్ సారా పీటర్సన్.. ఇండియన్ అధికారులకు వివరించారు. ఇప్పటికే చాలాసార్లు హెచ్చరించామని, జిమ్నాస్టిక్ వేదిక వద్ద కూడా ఇలాగే జరిగిందని గుర్తు చేశారట.
ఈ యవ్వారంపై ఇండియా అధికారి రాకేష్గుప్తా స్పందించారు. భారత్- జపాన్ మ్యాచ్ సందర్భంగా వేదిక వద్ద క్రీడాకారులను కలిసేందుకు మంత్రి ప్రయత్నించారు. కానీ అక్కడకు వెళ్లాలంటే స్పెషల్గా పాస్ కావాలని తెలుసుకొని ప్లేయర్స్ని బయట కలుసుకున్నారని వివరణ ఇచ్చారు. ఈ యవ్వారంపై మంత్రి గోయల్ కూడా స్పందించారు. తాను క్రీడా వేదిక వద్దకు వెళ్లలేదని, వాలంటీర్లు తనను అక్కడకు తీసుకువెళ్లారని గుర్తు చేశారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







