ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారిని పరామర్శించిన రామ్
- August 12, 2016
విశాఖలో ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న ఐదేళ్ల చిన్నారి కుందన పూర్ణ చంద్రికను సినీనటుడు రామ్ పరామర్శించారు. ఎంవీపీ కాలనీ సెక్టార్-3లోని కుందన ఇంటికి వచ్చి చిన్నారితో కాసేపు గడిపారు. కుందన త్వరగా కోలుకొని, సంతోషంగా తిరగాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. రామ్ అంటే కుందనకు ఎంతో అభిమానమని.. రామ్ను చూడాలన్న ఆమె కోరిక నెరవేరడంతో ఎంతో సంతోషంగా ఉందని కుందన తల్లిదండ్రులు తెలిపారు.
కుందన పుట్టినప్పట్నుంచి నడుము కింది భాగం పూర్తిగా చచ్చుబడిపోయింది. కాళ్లు కదపలేని పరిస్థితులో ఉన్న ఆమెను తల్లిదండ్రులు జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. 'ఈనాడు'లో ప్రచురితమైన కథనంతోనే తన అభిమాని పూర్ణ చంద్రిక కోరిక తెలుసుకోగల్గానని ఈ సందర్భంగా రామ్ అన్నారు.
సుమారు 15 నిమిషాల పాటు చిన్నారితో గడిపిన రామ్ శనివారం భోజనానికి రావాలని కుందన కుటుంబ సభ్యులను ఆహ్వానించారు. ఆయన వెంట బీజేవైఎం రాష్ట్ర ప్రతినిధి దామోదర యాదవ్, హైపర్ చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







