సందీప్ కు విలన్ అయిన తనీష్
- August 12, 2016
సందీప్ కిషన్, రెజినా జంటగా' నక్షత్రం' మూవీ డైరెక్ట్ చేస్తునాడు కృష్ణంవంశీ.ఈ మూవీలో మెగా మేనల్లుడు గెస్ట్ గా ఓ కాప్ క్యారెక్టర్ చేస్తున్నాడు.ఇప్పుడు ఈ మూవీలో విలన్ గా తనీష్ ని తీసుకోనున్నారని టాక్.ఇదే నిజమైతే తనీష్ కి లక్కీఛాన్స్ వచ్చినట్టే.
చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రారంభమైన తనీష్ కెరీర్ రవిబాబు డైరెక్ట్ చేసిన 'నచ్చవులే' మూవీతో హీరోగా టర్న్ తీసుకొంది. తరువాత వరుసగా సినిమాలు చేసిన తనీష్ కి సరైన సక్సెస్ రాక హీరోగా అతని కెరీర్ డల్ అయ్యింది.హీరోగా తనీష్ ఆల్మోస్ట్ ఫేడ్ అవుట్ స్టేజ్ కి వచ్చాడు.ఇప్పుడు కృష్ణ వంశీ మూవీలో విలన్ గా ఆఫర్ రావడం తో మళ్ళీ తనీష్ కెరీర్ టర్న్ అయ్యే అవకాశం వుంది. రీసెంట్ గా వచ్చిన నారా రోహిత్ 'రాజా చెయ్యి వేస్తే ' మూవీలో తారక రత్న విలన్ గా చేసి మంచి మార్కులు కోట్టేసాడు. ఇప్పుడు తనీష్ విలన్ పనులు చేస్తూ ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తాడో చూడాలి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







