ఇరాన్ తీరుపై యూఏఈ ఫైర్.. ఉద్రిక్తతలు తగ్గించే ఆలోచన లేదా?
- July 08, 2026
అబూదాబి: హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన తాజా దాడులు, అలాగే బహ్రెయిన్, కువైట్లపై కొనసాగుతున్న దాడుల నేపథ్యంలో యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు డాక్టర్ అన్వర్ గర్గాష్ ఇరాన్పై తీవ్ర విమర్శలు చేశారు. ఇలాంటి చర్యలు ఉద్రిక్తతలను తగ్గించే దిశగా కాకుండా, యుద్ధ వాతావరణాన్ని కొనసాగించాలనే తేహ్రాన్ వైఖరిని స్పష్టంగా చూపుతున్నాయని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో స్పందించారు గర్గాష్. హోర్ముజ్ జలసంధిలో ఖతార్, సౌదీ అరేబియాకు చెందిన వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, బహ్రెయిన్, కువైట్లపై వరుస దాడులు చేయడం ఆందోళనకరమన్నారు. గల్ఫ్ దేశాలు ఇరాన్ కు లక్ష్యంగా మారడం ఆంధోళన కరమని అన్నారు.
హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న మూడు వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు జరిపిన అనంతరం అమెరికా ప్రతిదాడులు చేపట్టిందని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఈ ఘటనలు గత నెలలో అమెరికా–ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై మళ్లీ అనిశ్చితిని పెంచాయని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, హోర్ముజ్ జలసంధి సమీపంలో ఓ ట్యాంకర్ను గుర్తు తెలియని వస్తువు తాకడంతో మంటలు చెలరేగాయని, అనంతరం మరో రెండు నౌకలపై కూడా దాడులు జరిగాని, ఈ ఘటనలు ఒమన్ తీరానికి సమీపంలో చోటుచేసుకున్నాయని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు రెండు శాతానికి పైగా పెరిగి రెండు వారాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచ ఇంధన సరఫరాపై మళ్లీ ఆందోళనలు నెలకొన్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







