కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- July 08, 2026
కువైట్ :భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ మూడు రోజుల అధికారిక పర్యటన కోసం కువైట్కు చేరుకున్నారు. గల్ఫ్ దేశాలతో పాటు ఇతర కీలక భాగస్వామ్య దేశాలతో వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా చేపట్టిన ఆరు దేశాల పర్యటనలో భాగంగా ఆయన కువైట్ను సందర్శిస్తున్నారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జైశంకర్కు ఆ దేశ ఉప విదేశాంగ మంత్రి హమద్ సులైమాన్ మషాన్ అల్-మషాన్ ఘన స్వాగతం పలికారు.
జూలై 7 నుంచి 9 వరకు జరిగే ఈ పర్యటనలో జైశంకర్ కువైట్ నాయకత్వం, సీనియర్ ప్రభుత్వ ప్రతినిధులతో ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, సాంకేతికత, విద్య, కాన్సులర్ సేవలు తదితర కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించే అంశాలపై చర్చలు జరగనున్నాయి. అలాగే, కువైట్ విదేశాంగ మంత్రితో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై గల్ఫ్ ప్రాంతంలోని తాజా భౌగోళిక-రాజకీయ పరిణామాలు, ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై అభిప్రాయాలు పంచుకోనున్నారు.
ఈ పర్యటన భారత్–కువైట్ మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి నిదర్శనంగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. ఆర్థిక, రాజకీయ, ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు గల్ఫ్ దేశాలతో సహకారాన్ని విస్తరించాలన్న భారత ప్రభుత్వ సంకల్పాన్ని ఈ పర్యటన చాటుతోందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







