విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- July 10, 2026
విజయవాడ: విజయవాడ (గన్నవరం) అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశానికి మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు, విజయవాడ ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ వల్లభనేని బాలశౌరి అధ్యక్షత వహించారు.
సమావేశంలో విజయవాడ పార్లమెంట్ సభ్యుడు, ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ కో-ఛైర్మన్ కేశినేని శివనాథ్ (చిన్ని), గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు, విజయవాడ విమానాశ్రయ డైరెక్టర్ లక్ష్మీకాంతా రెడ్డి, ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సభ్యులు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పన, మౌలిక వసతుల విస్తరణ, విమాన సర్వీసుల పెంపు, భద్రతా ప్రమాణాల బలోపేతం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.
విమానాశ్రయాన్ని మరింత ఆధునికంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని సమావేశంలో అధికారులు నిర్ణయించారు. అలాగే వివిధ శాఖల మధ్య సమన్వయంతో విమానాశ్రయ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరాన్ని సభ్యులు ప్రస్తావించారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







