విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- July 10, 2026
విజయవాడ: విజయవాడ (గన్నవరం) అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశానికి మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు, విజయవాడ ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ వల్లభనేని బాలశౌరి అధ్యక్షత వహించారు.
సమావేశంలో విజయవాడ పార్లమెంట్ సభ్యుడు, ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ కో-ఛైర్మన్ కేశినేని శివనాథ్ (చిన్ని), గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు, విజయవాడ విమానాశ్రయ డైరెక్టర్ లక్ష్మీకాంతా రెడ్డి, ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సభ్యులు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పన, మౌలిక వసతుల విస్తరణ, విమాన సర్వీసుల పెంపు, భద్రతా ప్రమాణాల బలోపేతం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.
విమానాశ్రయాన్ని మరింత ఆధునికంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని సమావేశంలో అధికారులు నిర్ణయించారు. అలాగే వివిధ శాఖల మధ్య సమన్వయంతో విమానాశ్రయ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరాన్ని సభ్యులు ప్రస్తావించారు.
తాజా వార్తలు
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!
- జెడ్డాలో 1,480 మంది పౌరులకు భూమి పత్రాలు అందజేత..!!
- ఖతార్ సైంటిఫిక్ క్లబ్ ‘యంగ్ ఇన్వెంటర్స్’ ప్రారంభం..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు పసికందులు సజీవ దహనం
- ఫస్ట్, బిజినెస్ క్లాస్ టికెట్లపై రూమర్స్.. ఖండించిన కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీ దౌత్య శిక్షణ సంస్థ డీజీతో భారత రాయబారి విపుల్ భేటీ
- సీఎం రేవంత్ US టూర్ రద్దు..







