మంగాత్తా-2 లో అజిత్..
- August 12, 2016
ప్రస్తుతం సీక్వెల్ ట్రెండ్ నడుస్తోందని చెప్పవచ్చు. ఎందిరన్ వంటి భారీ చిత్రాల నుంచి చెన్నై-28 లాంటి చిన్న బడ్జెట్ చిత్రాల వరకూ సీక్వెల్స్ తయారవుతున్నాయి.తాజాగా మంగాత్తా-2 చెయాలన్న కోరికను ఆ చిత్ర దర్శకుడు వెంకట్ప్రభు వ్యక్తం చేశారు. అజిత్ సినీ కేరీర్లో ఒక మైలురాయిగా నిలిచిన చిత్రం మంగాత్తా. త్రిష, ఆండ్రియా, రాయ్లక్ష్మీ, అంజిలి అంటూ పెద్ద తారాగణమే నటించిన చిత్రం ఇది. ప్రధాన పాత్రలో యాక్షన్కింగ్ అర్జున్ నటించిన ఈ చిత్రం ఐదేళ్ల ముందు తెరపైకి వచ్చి సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.పలు ట్విస్ట్లతో రూపొందించిన మంగాత్తా చిత్రంలో ముఖ్యంగా చివరి ఘట్ట దృశ్యాలు ప్రేక్షకులను థ్రిల్కు గురి చేస్తాయి. అలాంటి చిత్రానికి సీక్వెల్ ఉంటుందని అప్పట్లోనే ఊహించారు. వారి ఊహలను నిజం చెయాలన్న ఆలోచనలో దర్శకుడు వెంకట్ప్రభు ఉన్నారు. ఇటీవల ఒక భేటీలో ఆయన ఈ విషయాన్ని వ్యక్తం చేశారు. అయితే దీనికి నటుడు అజిత్ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది వేచి చూడాలి.ఆయన ప్రస్తుతం తన 57వ చిత్రాన్ని ఇటీవలే ప్రారంభించారు.అదే విధంగా దర్శకుడు వెంకట్ప్రభు చెన్నై-28కు సీక్వెల్ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. తదుపరి శింబు హీరోగా బిల్లా 2018 చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







