'జనతా గ్యారేజ్' ఆడియో రిలీజ్ ఫంక్షన్
- August 12, 2016
జనతాగ్యారేజ్తో తన గమ్యానికి మరింత దగ్గరయ్యాయనని ఎన్టీఆర్ స్పష్టంచేశాడు. పుష్కరకాలం తర్వాత ఇవ్వబోయే భారీ హిట్.. తనకు అత్యంత ఆప్తుడైన శివ ఇస్తాడేమో అనిపిస్తుందని మనసులోని మాట బయటపెట్టాడు ఎన్టీఆర్. హైదరాబాద్ శిల్పకళా వేదికలో శుక్రవారం 'జనతా గ్యారేజ్' ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈ సందర్భంగా అభిమానులనుద్దేశించి మాట్లాడిన ఎన్టీఆర్.. 'టెంపర్'తో చిన్న వెలుగు చూశానని, ఆ తర్వాత 'నాన్నకు ప్రేమతో' ఇంకా దగ్గరయ్యాను.. ఇప్పుడు 'జనతా గ్యారేజ్'తో తన గమ్యానికి మరింత దగ్గరయ్యానని యంగ్ టైగర్ అన్నాడు.ఎప్పటికప్పుడు అభిమానులు రుణం తీర్చుకోవాలనుకుంటానని, కానీ ఈ జన్మలో అది జరగదేమో అనిపిస్తుందని వ్యక్తంచేశాడు. మహానటుడు ఎన్టీఆర్ మనవడిగా పుట్టడం ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యమని, ఇంతమంది అభిమానుల్ని సంపాదించుకున్నాను. ఫస్ట్ మూవీ చేసినప్పుడు తానేమిటో తనకు అర్ధంకాలేదని, 'ఆది', 'సింహాద్రి' హిట్స్తో సక్సెస్ అంటే ఇంతేనేమో అనుకున్నానని, వరసగా సినిమాలు చేస్తున్నా కానీ ఫ్యాన్స్ని ఆనందపరచలేక పోయానని గుర్తు చేశాడు. అద్భుతమైన నటుడు మోహనలాల్తో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకునే అవకాశం తనకు దక్కిందని, శివకు తప్పకుండా హ్యాట్రిక్ హిట్ అవుతుందన్న ఒపీనియన్ని వ్యక్తంచేశాడు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన







