హైదరాబాద్ త్రోబాల్ చాంపియన్షిప్లో పురుషుల, మహిళల జట్లు శుభారంభం
- August 13, 2016
తెలంగాణ త్రోబాల్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతోన్న అంతర జిల్లా త్రోబాల్ చాంపియన్షిప్లో హైదరాబాద్ పురుషుల, మహిళల జట్లు శుభారంభం చేశాయి. సికింద్రాబాద్లోని పల్లవి మోడల్ స్కూల్లో శుక్రవారం పురుషుల విభాగంలో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ జట్టు 15-5, 15-8తో మెదక్ జట్టుపై విజయం సాధించగా... మహిళల విభాగంలో హైదరాబాద్ జట్టు 15-3, 15-2తో కరీంనగర్ జట్టును చిత్తుగా ఓడించింది. పురుషుల విభాగంలో జరిగిన ఇతర మ్యాచ్ల్లో రంగారెడ్డి జట్టు 15-6, 15-4తో కరీంనగర్పై, ఆదిలాబాద్ జట్టు 15-8, 15-6తో మహబూబ్నగర్పై, హైదరాబాద్ 15-5, 15-12తో నిజామాబాద్పై, రంగారెడ్డి 15-8, 15-13తో ఖమ్మంపై, వరంగల్ 15-8, 15-11తో నల్లగొండపై గెలుపొందాయి. మహిళల విభాగంలో రంగారెడ్డి జట్టు 15-07, 15-04తో మెదక్పై, వరంగల్ జట్టు 15-09, 04-15, 15-11తో నల్లగొండపై, ఆదిలాబాద్ జట్టు 15-05, 15-07తో మహబూబ్నగర్పై, హైదరాబాద్ జట్టు 15-04, 15-02తో నిజామాబాద్ జట్లపై నె గ్గాయి. అంతకుముందు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పద్మారావు ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే కనికారెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి, రాష్ట్ర త్రోబాల్ సంఘం కార్యదర్శి జగన్ మోహన్, పల్లవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ మల్క కొమురయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు









