భారత్ ఇకపై హార్ముజ్ జలసంధి పై ఆధారపడదు
- July 16, 2026
పశ్చిమ ఆసియాలో రెండు దేశాల మధ్య కొనసాగుతున్న సాయుధ ఘర్షణలు ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ యుద్ధ ప్రభావం చమురు సరఫరాపై విపరీతంగా పడుతోంది. ముఖ్యంగా భారతదేశ ఇంధన భద్రత, సరఫరా మార్గాల స్వరూపాన్ని ఇది పూర్తిగా మారుస్తోంది. యుద్ధం కారణంగా ఎదురవుతున్న తీవ్రమైన ప్రమాదాలను నివారించేందుకు.. భారతీయ రిఫైనరీలు, చమురు దిగుమతిదారులు సరికొత్త వ్యూహాత్మక మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ ప్రాంతం నుండి ఇంధన సరఫరాలను సురక్షితంగా భారతదేశానికి చేర్చడానికి, వారు సాంప్రదాయకంగా ఉపయోగించే అత్యంత సంక్లిష్టమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) షిప్పింగ్ మార్గానికి వెలుపల ఉన్న ఒమన్ గల్ఫ్ వెంబడి గల ఓడరేవులపై ఎక్కువగా ఆధారపడుతున్నారు.
యుద్ధ మేఘాలు కొత్త ఆందోళనలు
ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి చెందిన ఫుజైరా, ఖోర్ ఫక్కాన్ ఓడరేవులు ప్రస్తుతం భారతీయ చమురు దిగుమతులకు ప్రధాన కేంద్రాలుగా మారాయి. వాణిజ్య నౌకలపై దాడులు శరవేగంగా పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో. హార్ముజ్ జలసంధికి తూర్పు వైపున ఉన్న యూఏఈకి చెందిన ఈ ప్రత్యామ్నాయ ఓడరేవులు భారతదేశ ఇంధన అవసరాలకు ఒక జీవనాధారంగా నిలుస్తున్నాయి. దీనితో పాటు.. ప్రమాదకరమైన జలమార్గాన్ని దాటకుండా ఉండేందుకు భారతీయ రిఫైనరీలు యూఏఈకి చెందిన 406 కిలోమీటర్ల పొడవైన హబ్షాన్-ఫుజైరా వ్యూహాత్మక చమురు పైప్లైన్ను కూడా ఒక సమర్థవంతమైన ప్రత్యామ్నాయ మార్గంగా వినియోగిస్తున్నట్లు ఈ రంగానికి చెందిన నిపుణులు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన.. అయితే ఈ సరికొత్త ప్రత్యామ్నాయ మార్గాలు భారతదేశానికి కొంతవరకు ఉపశమనాన్ని కలిగిస్తున్నప్పటికీ… యుద్ధ మేఘాలు కొత్త ఆందోళనలను రేకెత్తిస్తూనే ఉన్నాయి. ఈ ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను.. రేవులను కూడా తాము లక్ష్యంగా చేసుకుంటామని బుధవారం టెహ్రాన్ (ఇరాన్) హెచ్చరించినట్లు వచ్చిన తాజా నివేదికలు భారతీయ ఇంధన మార్కెట్లో.. దిగుమతిదారులలో సరికొత్త ఆందోళనలకు కారణమవుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల అనంతరం ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20 శాతం వాటా కలిగిన అత్యంత వ్యూహాత్మక హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో గల్ఫ్ ప్రాంతం నుండి సరఫరాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







