ట్విట్టర్ లో మరో మైలురాయి చేరుకున్న మోడీ
- August 13, 2016
ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ట్విట్టర్ ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. భారతీయ రాజకీయరంగంలో ఏ నాయకుడికి లేని ఫాలోయింగ్ ఆయనకుందని చెప్పుకోవచ్చు. సోషల్ నెట్వర్కింగ్ రాజకీయం కూడా మోడీ ద్వారానే అమల్లోకి వచ్చిందనే వాళ్లూ ఉన్నారు. తాజాగా ట్విట్టర్లో మరో కొత్త సంచలనాన్ని మోదీ సృష్టించారు. ట్విట్టర్లో మోస్ట్ ఫాలోయింగ్ ఇండియన్గా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ రికార్డును ఆయన దాటేశారు. బిగ్ బీ కంటే 16 వేల మంది ఫాలోయిర్స్ అధికంగా ఉండటం ద్వారా మోదీ నెంబర్ వన్ ప్లేస్లోకి వచ్చిచేరారు. గత జనవరిలో బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ ట్విట్టర్ ఫాలోయింగ్ను మోదీ అధిగమించి రెండో స్థానంలోకి వచ్చారు. ఈవారం ఆయన ఫాలోయిర్స్ సంఖ్య 2 కోట్ల 18 లక్షల 65 వేల 371 ఉంది. బచ్చన్ స్కోర్ 2 కోట్ల 18 లక్షల 48 వేల 572గా ఉంది. 2 కోట్లకు పైగా ఫాలోయిర్స్తో షారూక్ మూడో ప్లేస్లోకి వచ్చారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







