క్వెట్టాలో దాడి చేసింది తామేనంటున్న ఐఎస్ఐఎస్

- August 13, 2016 , by Maagulf
క్వెట్టాలో దాడి చేసింది తామేనంటున్న ఐఎస్ఐఎస్

పాకిస్థాన్‌లోని క్వెట్టాలో బాంబు దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ మేరకు దాడికి బాధ్యత వహిస్తూ.. ట్విట్టర్లో పోస్టు చేసింది. అయితే ఐఎస్‌ ప్రకటనను పాక్‌ భద్రతా సిబ్బంది వ్యతిరేకిస్తున్నారు. పాక్‌లో ప్రాబల్యం పెంచుకునేందుకే ఇస్లామిక్‌ స్టేట్‌ ఇలాంటి ప్రకటనలు చేస్తోందని పోలీసులు ఆరోపిస్తున్నారు.
పాకిస్థాన్‌ తాలిబన్‌, అల్‌ఖైదా మూలాలు ఎక్కువగా ఉన్న పాక్‌లో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉనికి తక్కువ. దీంతో తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు ఐఎస్‌ ఇలాంటి ప్రకటనలు చేస్తోంది. ఇటీవల క్వెట్టాలోని ప్రభుత్వాస్పత్రిలో జరిగిన దాడికి సైతం తమదే బాధ్యతంటూ ఐఎస్‌ ప్రకటించుకుంది. అయితే దీనికి ముందే దాడి చేసింది తామేనంటూ పాకిస్థానీ తాలిబన్‌ వెల్లడించింది.
లాయర్లను లక్ష్యంగా చేసుకుని గత సోమవారం పాక్‌లోని క్వెట్టాలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 73 మంది మృతిచెందగా.. 100 మందికి పైగా గాయపడ్డారు. ఇది జరిగిన రెండు రోజులకే క్వెట్టాలోని మరో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 17 మందికి గాయాలయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com