న్యూయార్క్‌ స్వాతంత్య్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొనున్న బాబా రాందేవ్

- August 13, 2016 , by Maagulf
న్యూయార్క్‌ స్వాతంత్య్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొనున్న బాబా రాందేవ్

ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ అమెరికాలో పర్యటించనున్నారు. న్యూయార్క్‌లో జరగనున్న 70వ స్వాతంత్య్ర దినోత్సవ పరేడ్‌లో ఆయన పాల్గొంటారు. ఆగస్టు 21న నిర్వహించే ఈ పరేడ్‌కు ఆయనను ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్లు ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ అసోసియేషన్‌(ఎఫ్‌ఐఏ) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా అమెరికాలోని హూస్టన్‌ నగరంలో యోగా శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఉత్తర అమెరికా పర్యటనలో భాగంగా ఆయన కెనడాలోని ఒంటారియో, హూస్టన్‌ నగరాల్లో పర్యటించి యోగా శిక్షకులు, సాధకులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com