విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- July 19, 2026
విజయవాడ: విజయవాడ విమానాశ్రయంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రయాణికులకు అందిస్తున్న సేవలు, భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు వల్లభనేని బాలశౌరి, విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ప్రాంతీయ విమాన రవాణా అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సమావేశంలో సమీక్షించారు. విమానాశ్రయంలో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి, నిర్వహణలో చేపడుతున్న మెరుగుదలలు, భవిష్యత్తులో చేపట్టనున్న విస్తరణ ప్రణాళికలపై అధికారులు వివరాలను అందించారు.
విమానాశ్రయ సామర్థ్యాన్ని పెంచి, పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో విమానయాన రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







