విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- July 19, 2026
విజయవాడ: విజయవాడ విమానాశ్రయంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రయాణికులకు అందిస్తున్న సేవలు, భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు వల్లభనేని బాలశౌరి, విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ప్రాంతీయ విమాన రవాణా అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సమావేశంలో సమీక్షించారు. విమానాశ్రయంలో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి, నిర్వహణలో చేపడుతున్న మెరుగుదలలు, భవిష్యత్తులో చేపట్టనున్న విస్తరణ ప్రణాళికలపై అధికారులు వివరాలను అందించారు.
విమానాశ్రయ సామర్థ్యాన్ని పెంచి, పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో విమానయాన రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!







