నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు

- July 20, 2026 , by Maagulf
నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన బాలింతలను, వారి నవజాత శిశువులను, సహాయకులను ఉచితంగా, సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. దీంతో పాటు, అధిక రక్తహీనతతో బాధపడే గర్భిణులు, ప్రమాదకర పరిస్థితుల్లో (High-Risk) ఉన్న గర్భిణులను వైద్య పరీక్షల నిమిత్తం సకాలంలో ఆసుపత్రులకు తీసుకురావడానికి కూడా ఈ వాహనాలను వినియోగించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సరికొత్తగా ప్రవేశపెడుతున్న 500 SUV/MUV వాహనాల ద్వారా అందించే ఈ సేవలతో ఏటా సుమారు 2.75 లక్షల మంది బాలింతలు లబ్ధి పొందనున్నారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

జీపీఎస్ ట్రాకింగ్, ఏసీ సౌకర్యాలతో హైటెక్ వాహనాలు
ఈ కొత్త వాహనాల్లో ప్రయాణికుల భద్రత, సౌకర్యాలకు అధికారులు పెద్దపీట వేశారు. వెనుక సీట్లలో సైతం సీటు బెల్టులు, బాలింతలు సులభంగా ఎక్కి దిగేందుకు వీలుగా ఫుట్‌రెస్ట్, ఎయిర్ కండిషనింగ్ (AC), ఫస్ట్ ఎయిడ్ కిట్, అగ్నిమాపక పరికరాలు వంటి అత్యాధునిక వసతులను ఏర్పాటు చేశారు. ప్రతి వాహనానికి జీపీఎస్ (GPS) ట్రాకింగ్ వ్యవస్థను అనుసంధానించడం ద్వారా వాటి కదలికలను కంట్రోల్ రూమ్ నుండి రియల్ టైమ్‌లో పర్యవేక్షించనున్నారు. వాహనాలపై అధికారిక స్టిక్కరింగ్ పూర్తి చేసి, త్వరలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి వీరపాండ్యన్, ఎన్‌హెచ్‌ఎం (NHM) ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com