బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- July 20, 2026
మనామా: 2026 తొలి ఐదు నెలల్లో బహ్రెయిన్ జాతీయ ఉత్పత్తుల ఎగుమతుల మొత్తం విలువ BD1.384 బిలియన్ కు చేరుకుంది. అయితే ప్రాంతీయ రవాణా అంతరాయాలు, గల్ఫ్ సముద్ర మార్గాల్లో సమస్యలు, బహ్రెయిన్ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేయడం వంటి పరిణామాల ప్రభావంతో మార్చి నుంచి ఎగుమతులు గణనీయంగా తగ్గినట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి.
జనవరి, ఫిబ్రవరి నెలల్లో నెలసరి సగటు ఎగుమతులు BD331.1 మిలియన్లు ఉండగా, మార్చి నుంచి మే వరకు అవి 27.3 శాతం తగ్గి BD240.7 మిలియన్లకు పడిపోయాయి. మార్చిలో ఎగుమతులు BD250.3 మిలియన్లుగా నమోదవగా, ఎయిర్ స్పేస్ తిరిగి తెరుచుకోవడంతో ఏప్రిల్లో BD265 మిలియన్లకు పెరిగాయి. అయితే మేలో మళ్లీ BD206.8 మిలియన్లకు పడిపోవడంతో, జనవరితో పోలిస్తే 38.4 శాతం తగ్గుదల నమోదైంది.
మార్చి నెలలో బహ్రెయిన్ చేరుకున్న ఎగుమతి గమ్యస్థానాల సంఖ్య 98 నుంచి 51కు తగ్గింది. అలాగే ఎగుమతి ఉత్పత్తుల విభాగాలు 676 నుంచి 477కు, ఎగుమతి ఒప్పందాలు 1,629 నుంచి 1,007కు పడిపోయాయి.
భారత్, అమెరికాకు ఎగుమతుల్లో భారీ తగ్గుదల
భారత్కు బహ్రెయిన్ ఎగుమతులు 65.8 శాతం తగ్గగా, అమెరికాకు ఎగుమతులు దాదాపు సగానికి పడిపోయాయి. యూరప్, ఆసియాలోని పలు దేశాలకు సరుకుల రవాణా కూడా 80 శాతానికి పైగా తగ్గినట్లు నివేదిక తెలిపింది.
ఇతర మార్కెట్లలో తగ్గుదలను గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాలు కొంత మేర భర్తీ చేశాయి. ఫిబ్రవరిలో BD157 మిలియన్లు ఉన్న GCC దేశాలకు ఎగుమతులు మార్చిలో BD173.4 మిలియన్లకు పెరిగాయి. దీంతో మొత్తం ఎగుమతుల్లో GCC వాటా 48.1 శాతం నుంచి 69.3 శాతానికి పెరిగింది.
బహ్రెయిన్ ఎగుమతుల్లో అల్యూమినియం కీలక స్థానాన్ని కొనసాగించింది. మొత్తం ఎగుమతుల్లో దీని వాటా 47.8 శాతం నుంచి 61.8 శాతం మధ్య నమోదైంది. అయితే ప్రాసెస్ చేయని అల్యూమినియం మిశ్రమాల (Unwrought Aluminium Alloy) ఎగుమతులు ఫిబ్రవరిలో BD98 మిలియన్లు ఉండగా, మార్చిలో BD42 మిలియన్లకు తగ్గాయి.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







