భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- July 21, 2026
న్యూఢిల్లీ: భారత్ లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కొత్త రాయబారిగా నియమితులైన అబ్దుల్లా అల్ నుఐమీ తన క్రెడెన్షియల్స్ డాక్యుమెంట్స్ ను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఆ శాఖ తాత్కాలిక చీఫ్ ఆఫ్ ప్రోటోకాల్కు సమర్పించారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అల్ నుఐమీకి శుభాకాంక్షలు తెలిపారు. భారత్–యూఏఈ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఆయన విజయవంతం కావాలని ఆకాంక్షించారు. రెండు దేశాల మధ్య సంబంధాల అభివృద్ధికి అవసరమైన అన్ని విధాల సహకారం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు.
అనంతరం అబ్దుల్లా అల్ నుఐమీ మాట్లాడుతూ.. భారత్లో యూఏఈకి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమని పేర్కొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక, సాంకేతిక, సాంస్కృతిక తదితర రంగాల్లో ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. అంతకుముందు, భారత్–యూఏఈ మధ్య సహకారాన్ని మరింత విస్తరించే అవకాశాలపై ఇరు పక్షాలు చర్చించాయి. రెండు దేశాల ప్రజల ఉమ్మడి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పరస్పర సంబంధాలను మరింత బలోపేతం చేసే మార్గాలపై అభిప్రాయాలు షేర్ చేసుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







