కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- July 21, 2026
మక్కా: ఉమ్రా యాత్రికులకు మరింత సౌలభ్యం కల్పించేలా సౌదీ అరేబియా హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖ ఒక సంవత్సరం కాలపరిమితి గల మల్టిపుల్ ఎంట్రీ ఉమ్రా వీసాను ప్రవేశపెట్టింది. ఈ వీసా ద్వారా యాత్రికులు ఏడాది వ్యవధిలో పలుమార్లు సౌదీ అరేబియాలోకి ప్రవేశించే అవకాశం పొందుతారు. ఈ వీసా జారీ చేసిన తేదీ నుంచి 365 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. వీసా గడువులో ఎన్నిసార్లైనా దేశంలోకి ప్రవేశించవచ్చు. అయితే అన్ని సందర్శనలను కలిపి మొత్తం 90 రోజులు మాత్రమే సౌదీలో ఉండేందుకు అనుమతి ఉంటుంది. ప్రతి పర్యటనలో గడిపిన రోజులను కలిపి ఈ 90 రోజుల పరిమితి ఉంటుంది.
అయితే హజ్ సీజన్లో ఈ మల్టిపుల్ ఎంట్రీ ఉమ్రా వీసాతో సౌదీలోకి ప్రవేశించేందుకు అనుమతి ఉండదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అలాగే ప్రతి సందర్శనకు బుక్ చేసుకునే సేవల ప్యాకేజీ వ్యవధి, వీసాలో మిగిలి ఉన్న రోజుల కంటే ఎక్కువ ఉండకూడదని పేర్కొంది. వీసా పొందాలంటే నుసుక్ (Nusuk) ప్లాట్ఫామ్లో నమోదైన గుర్తింపు పొందిన సేవా సంస్థలలో ఒకదాని ద్వారా ప్రతి పర్యటనకు ప్రత్యేక సేవా ప్యాకేజీని కొనుగోలు చేయాలి. అదనంగా, ప్రతి సందర్శనకు ముందు నుసుక్ యాప్ ద్వారా ఉమ్రా అనుమతి (Permit) తీసుకోవాలి. ఆ అనుమతి తేదీలు బుక్ చేసుకున్న సేవా ప్యాకేజీకి అనుగుణంగా ఉండాలి. అలాగే సౌదీ ప్రభుత్వం నిర్దేశించిన ప్రయాణ, ప్రవేశ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి.
ప్రతి విజిట్ ముగిసిన తర్వాత యాత్రికుడు సౌదీ నుంచి బయలుదేరిన వెంటనే వీసా తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది. తదుపరి సందర్శనకు అవసరమైన నిబంధనలు పూర్తి చేసిన తర్వాత అది మళ్లీ ఆటోమెటిక్ గా అమల్లోకి వస్తుంది. వీసాలో మిగిలి ఉన్న రోజులు గడువు ముగిసే వరకు తర్వాతి పర్యటనల్లో వినియోగించుకోవచ్చని హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







