కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- July 21, 2026
దోహా: ఖతార్లో వేసవి వినోద కార్యక్రమాలకు మరింత ఆకర్షణను తీసుకొస్తూ కలర్వర్స్ ఎక్స్పీరియన్స్ పేరుతో అత్యాధునిక ఇమర్సివ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఆకర్షణను కతారా కల్చరల్ విలేజ్ లో ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని విజిట్ ఖతార్ నిర్వహిస్తున్న హలా సమ్మర్–2026 ప్రచారంలో భాగంగా ఖతార్ క్యాలెండర్ మరియు స్పేస్టూన్** సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. ఇది సెప్టెంబర్ 15 వరకు కతారా కల్చరల్ విలేజ్ దక్షిణ పార్కింగ్ ప్రాంతంలో కొనసాగుతుంది. వారంలో సాధారణ రోజుల్లో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, వారాంతాల్లో రాత్రి 11 గంటల వరకు సందర్శకులకు అందుబాటులో ఉంటుంది. టికెట్లు ప్లాటినమ్లిస్ట్ ద్వారా పొందవచ్చు.
నాలుగేళ్లు పైబడిన పిల్లలు, కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ అనుభవంలో వినోదంతో పాటు ఆధునిక సాంకేతికతను మేళవించారు. ఇందులో సందర్శకులు 'రిస్టోరర్స్' పాత్రలోకి ప్రవేశించి, హ్యూ (HUE) అనే పాత్ర మార్గదర్శకత్వంలో రంగుల ప్రపంచమైన కలరామా అడ్వెంచర్ యాత్రలో పాల్గొంటారు. ఒకప్పుడు రంగుల కాంతులతో కళకళలాడిన కలరామాపై 'మంచర్స్' అనే రహస్య జీవులు దాడి చేసి రంగులను హరించేస్తాయి. వాటిని తిరిగి పునరుద్ధరించేందుకు సందర్శకులు ఏడు ప్రత్యేక థీమ్ జోన్లలో సవాళ్లను పూర్తి చేస్తూ చివరకు కలరామా సిటీలో తుది మిషన్ను పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఈ అనుభవంలో ప్రొజెక్షన్ మ్యాపింగ్, డైనమిక్ లైటింగ్, ఇమర్సివ్ సౌండ్, మోషన్ ఆధారిత ఎఫెక్ట్స్, ఇంటరాక్టివ్ డిజిటల్ గేమ్స్ వంటి అత్యాధునిక సాంకేతికతలను వినియోగించారు. అలాగే కుటుంబ సభ్యులు కలిసి పాల్గొనే టీమ్వర్క్, సృజనాత్మకతను పెంపొందించే కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు.అలాగే, ప్రత్యక్ష వేదిక ప్రదర్శనలు, కలర్వర్స్ పాత్రలతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాలు, పలు ఇంటరాక్టివ్ ఇన్స్టాలేషన్లు సందర్శకులను మరింత ఆకట్టుకోనున్నాయి.
హలా సమ్మర్–2026లో భాగంగా 'కిడ్స్ గో ఫ్రీ' కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తున్నారు. దీని ద్వారా 12 ఏళ్లలోపు పిల్లలు ఎంపిక చేసిన హోటళ్లలో స్టే, భోజనం, కొన్ని వినోద కార్యక్రమాలను అదనపు ఛార్జీ లేకుండా ఆస్వాదించే అవకాశం కల్పించారు. షాపింగ్ ఆఫర్లు, కుటుంబ వినోద కార్యక్రమాలు, సాంస్కృతిక వేడుకలతో ఖతార్ వేసవి పర్యాటకాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చే లక్ష్యంతో ఇది కొనసాగుతోంది.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







