అవయవాల మార్పిడి మాఫియా విషయమై బహ్రెయిన్ అప్రమత్తం!

- July 27, 2015 , by Maagulf
అవయవాల మార్పిడి మాఫియా విషయమై బహ్రెయిన్ అప్రమత్తం!

పెద్ద సంఖ్యలో బహ్రెయిన్ వాసులు కిడ్నీ మార్పిడి గురించి విదేశాలకు వెళ్తున్న నేపధ్యంలో, మెడికల్ టూరిజoను గురించి ఆరోగ్య శాఖాధికారులు కఠిన హెచ్చరికలు జారీచేశారు. 1997 సంవత్సరం నుడి నేటివరకు కిడ్నీ గురించి 123మంది పౌరులు విదేశాలకు వెళ్ళి వచ్చారు. వారిలో ఎక్కువమంది ఫిలిప్పైన్స్ లేదా ఇరాన్, మిగిలిన వారు పాకిస్తాన్, ఇండియా, ఈజిప్ట్, ఇరాక్, సిరియా లేదా బంగ్లాదేశ్ లకు వెళ్లారు. ఐతే వారిలో 26గురు తదనంతరం మరణించడం విషాదకరం. ఈ సందర్భంగా ట్రాన్స్ ప్లాంట్సెంటర్ హెడ్ డా. సౌమాయా అల్ ఘరీబ్, అవయవాలను ఇతరదేశాల నుండి కొనుగోలు చేయడాన్ని ఆపడానికి  మరింత కఠిన నిబంధనలు అమలులోకి తేవాలని అభిప్రాయపడ్డారు.


--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com