ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- July 23, 2026
దోహా: ఖతార్లో మూడు సంవత్సరాల పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసిన భారత రాయబారి హెచ్.ఇ. విపుల్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా భారత-ఖతార్ ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయని, ఖతార్ నాయకత్వం మరియు భారతీయ ప్రవాసుల సహకారం తన పదవీకాలాన్ని విజయవంతం చేసిందని రాయబారి విపుల్ పేర్కొన్నారు.
రాయబారి విపుల్ను ప్రజల రాయబారి (People's Ambassador)గా అభివర్ణిస్తూ, ఆయన అందుబాటులో ఉండే తీరు, ప్రజల సమస్యల పట్ల చూపిన చొరవ, సేవాభావం కారణంగా ప్రవాస భారతీయుల గౌరవాన్ని, అభిమానాన్ని పొందారని ఇండియన్ కమ్యూనిటీ నాయకులు కొనియాడారు.
ఈ వీడ్కోలు కార్యక్రమాన్ని ఇండియన్ కల్చరల్ సెంటర్ (ICC), ఇండియన్ కమ్యూనిటీ బెనెవోలెంట్ ఫోరం (ICBF), ఇండియన్ స్పోర్ట్స్ సెంటర్ (ISC), ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్స్ కౌన్సిల్ (IBPC) సంయుక్తంగా ఐసీసీ అశోకా హాల్లో నిర్వహించాయి.
ఖతార్లో 8.3 లక్షలకు పైగా ఉన్న ఇండియన్ కమ్యూనిటీ ప్రపంచంలోనే అత్యంత క్రమబద్ధంగా పనిచేసే ప్రవాస సమాజాల్లో ఒకటిగా నిలిచిందని విపుల్ ప్రశంసించారు. భారత రాయబార కార్యాలయంతో కలిసి ఐసీసీ, ఐసీబీఎఫ్, ఐఎస్సీ, ఐబీపీసీ సంస్థలు భారతీయుల సంక్షేమం కోసం విశేషంగా పనిచేశాయని పేర్కొన్నారు. గత మూడు సంవత్సరాల్లో సంస్కృతి, క్రీడలు, వ్యాపారం, సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణలో ఈ సంస్థలు కీలక పాత్ర పోషించాయని రాయబారి విపుల్ తెలిపారు.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







