బహ్రెయిన్‌లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!

- July 24, 2026 , by Maagulf
బహ్రెయిన్‌లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!

మనామా: ప్రభుత్వ సేవలను మరింత వేగవంతం, సులభతరం, ప్రజలకు అనుకూలంగా మార్చే లక్ష్యంతో బహ్రెయిన్ ప్రభుత్వం జనవరి 15 నుంచి జూలై 23 వరకు 20 ప్రభుత్వ సంస్థలకు చెందిన 109 సేవలను అభివృద్ధి చేసింది. అభివృద్ధి చేసిన సేవల్లో భాగంగా మున్సిపాలిటీల వ్యవహారాలు, వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ సేవల కోసం యూనిఫైడ్ రిమోట్ కస్టమర్ సర్వీస్ సెంటర్ ప్రారంభించారు.

అలాగే బహ్రెయిన్ విశ్వవిద్యాలయం ఈ-గవర్నమెంట్ పోర్టల్ ద్వారా అధికారిక ప్రకటనలు, రికార్డులు, విద్యార్థుల మార్కులు, ఆర్కైవ్ ఫైళ్ల వివరాలను ఆన్‌లైన్‌లో తెలుసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఇస్లామిక్ అఫైర్స్ ఎండౌమెంట్స్ కౌన్సిల్ పరిధిలో వక్ఫ్ ఆస్తుల అద్దె రుసుములను బెనిఫిట్ (Benefit) యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించే సదుపాయాన్ని కూడా ప్రారంభించారు.

ఇక రవాణా, టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ 'టాజర్ (Tajer)' యాప్ ద్వారా రవాణా కార్యకలాపాలపై రిమోట్ తనిఖీ సేవను అందుబాటులోకి తీసుకువచ్చింది.

సుప్రీం కౌన్సిల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ 'సహాబ్ (Sahab)' ప్లాట్‌ఫారమ్ ద్వారా రిఫ్రిజెరెంట్ గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రాలకు లైసెన్స్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సేవను ప్రారంభించింది.

ఈ సేవల అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సేవలను 100 శాతం డిజిటల్ రూపంలోకి మార్చడంతో పాటు, సేవల అమలు గడువును కనీసం 25 శాతం తగ్గించారు. దరఖాస్తు ప్రక్రియను గరిష్టంగా నాలుగు దశలకు పరిమితం చేయగా, అవసరమైన పత్రాలను 50 శాతం వరకు తగ్గించారు. ఇలా అన్ని వేదికల్లో సేవల సమాచారాన్ని ఒకే విధంగా అందుబాటులో ఉంచడం వంటి కీలక మార్పులను ప్రభుత్వం అమలు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com