సౌదీ–ఖతార్లో కొత్త చెల్లింపు సదుపాయం..!!
- September 16, 2026
రియాద్: సౌదీ అరేబియా, ఖతార్ మధ్య ఆర్థిక, చెల్లింపు వ్యవస్థల అనుసంధానం మరింత బలోపేతం కానుంది. ఇరు దేశాల జాతీయ చెల్లింపు కార్డులైన ‘మదా (mada)’, ‘హిమ్యాన్ (HIMYAN)’ కార్డుల పరస్పర వినియోగాన్ని దశలవారీగా అందుబాటులోకి తీసుకురానున్నారు. సౌదీ సెంట్రల్ బ్యాంక్ (SAMA), ఖతార్ సెంట్రల్ బ్యాంక్తో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దీని ప్రకారం ఖతార్లో సౌదీ ‘మదా’ కార్డులతో, సౌదీ అరేబియాలో ఖతార్ ‘హిమ్యాన్’ కార్డులతో చెల్లింపులు చేసుకునే అవకాశం క్రమంగా అందుబాటులోకి రానుంది.
ఇరు దేశాల జాతీయ చెల్లింపు కార్డుల పరస్పర ఆమోదం ద్వారా సౌదీ, ఖతార్ మధ్య ఆర్థిక సహకారం మరింత పెరగనుంది. అలాగే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాల మధ్య ఉమ్మడి చెల్లింపు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలనే ప్రయత్నాలకు ఇది మద్దతు ఇస్తుందని అధికారులు తెలిపారు.
గల్ఫ్ దేశాల మధ్య ఇప్పటికే పనిచేస్తున్న జీసీసీ పేమెంట్ నెట్ వర్క్ (GCC-NET) ద్వారా ఆయా దేశాల పౌరులు, ప్రవాసులు ఇతర GCC దేశాల్లో డెబిట్ కార్డులను ఉపయోగించుకునే సదుపాయం ఉంది. ఈ నెట్వర్క్ ద్వారా ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరించుకోవడంతో పాటు, POS మెషీన్ల వద్ద చెల్లింపులు చేసుకోవచ్చు. దీంతో గల్ఫ్ దేశాల్లో ప్రయాణించే వారికి చెల్లింపులు మరింత సులభంగా, వేగంగా, తక్కువ ఖర్చుతో పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా GCC దేశాల మధ్య ఆర్థిక అనుసంధానం మరింత బలోపేతం కానుంది.
తాజా వార్తలు
- 974 బీచ్లో ‘ఫ్లోటీస్ ఫెస్టివల్’.. సందడి చేసేలా ఏర్పాట్లు..!!
- కువైట్లో ప్రవాసులకు లోన్లు మరింత కఠినం..!!
- సౌదీ–ఖతార్లో కొత్త చెల్లింపు సదుపాయం..!!
- ఆర్థిక, ఆర్థిక సహకారం బలోపేతంపై బహ్రెయిన్–సెర్బియా చర్చలు..!!
- టెస్లా కార్లు రీకాల్.. ఎయిర్బ్యాగ్లో సాంకేతిక లోపం..!!
- సుల్తాన్ బోట్స్వానా పర్యటనతో కొత్త పెట్టుబడి అవకాశాలు..!!
- షార్జాలో విషాదం.. ఇంట్లో కుప్పకూలి 32 ఏళ్ల భారతీయ మహిళ మృతి..!!
- పదోన్నతుల కోసం ఏళ్లుగా ఎదురుచూపులు..పోలీసు అధికారులతో డీజీపీ కీలక చర్చలు
- అబుదాబిలో యూఏఈ–ఇండియా డిఫెన్స్ ఇండస్ట్రీ ఫోరం ప్రారంభం
- మంగినపూడి సాగర తీర మహాగణపతి ఉత్సవాలకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్







