శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!

- July 25, 2026 , by Maagulf
శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయానికి ఉత్తరం వైపున ఉన్న పవిత్ర స్వామి పుష్కరిణి మరమ్మతులు, శుద్ధి పనుల కోసం ఆగస్టు 1వ తేదీ నుండి మూసివేయబడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రకటించింది. ప్రతీ ఏటా ఏడుకొండల స్వామి బ్రహ్మోత్సవాలకు ముందు పుష్కరిణిలోని నీటిని పూర్తిగా తొలగించి శుభ్రం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 15వ తేదీ నుండి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 11వ తేదీ నుండి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు ముందే పుష్కరిణిని సిద్ధం చేయాలని టీటీడీ అదనపు ఈఓ చిరుమామిళ్ళ వెంకయ్యచౌదరి ఇంజనీరింగ్, వాటర్ వర్క్స్ విభాగ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

40 రోజుల పాటు మూసివేత.. భక్తులకు ప్రవేశం లేదు
సివిల్ పనులు, లోపల ఉన్న పైప్‌లైన్ల మరమ్మతుల కోసం ఆగస్టు 1 నుండి 31వ తేదీ వరకు పుష్కరిణిని పూర్తిగా మూసివేస్తారు. అనంతరం వర్షాకాలం, తుఫాన్లు, ఇతర ముందస్తు జాగ్రత్త చర్యల దృష్ట్యా సెప్టెంబర్ 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు కూడా మూసివేత కొనసాగుతుంది. అంటే మొత్తం 40 రోజుల పాటు భక్తులను పుష్కరిణిలోకి దిగడానికి గానీ, స్నానాలు చేయడానికి గానీ అనుమతించరు. అంతేకాకుండా, ఈ కాలంలో నిర్వహించే రోజువారీ పుష్కరిణి హారతి కార్యక్రమాన్ని కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com