బీఎస్ఎన్ఎల్ వారి బంపర్ ఆఫర్
- August 14, 2016
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ స్వాతంత్య్రదినోత్సవ సందర్భంగా తమ వినియోగదారుల కోసం కొత్త ఆఫర్ను ప్రవేశపెట్టింది. ప్రతి ఆదివారం ల్యాండ్లైన్ నుంచి దేశంలోని ఏ నెట్వర్క్ ల్యాండ్లైన్ లేదా మొబైల్ ఫోన్కు అపరిమిత కాల్స్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు టెలికాంశాఖ మంత్రి మనోజ్ సిన్హా వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ సంస్థ మరో ఆఫర్ను ప్రకటించింది. స్వాతంత్య్రదినోత్సవం(ఆగస్టు 15న) సందర్భంగా ల్యాండ్లైన్ నుంచి ఏ నెట్వర్క్ ల్యాండ్లైన్ లేదా మొబైల్ ఫోన్కు అపరిమితంగా మాట్లాడుకునే వీలు కల్పిస్తున్నట్లు తెలిపింది. ప్రైవేటు సంస్థల నుంచి పోటీని తట్టుకునేందుకు ఇప్పటికే రాత్రి 9 నుంచి 7 గంటల వరకు ల్యాండ్లైన్ నుంచి ఏ నెట్వర్క్ ల్యాండ్లైన్ లేదా మొబైల్కు అపరిమితంగా మాట్లాడుకునే సౌకర్యాన్ని బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







