ఆఫ్ఘనిస్థాన్‌లో వైమానిక దాడులు, 25 మంది ఉగ్రవాదులు మృతి

- August 14, 2016 , by Maagulf
ఆఫ్ఘనిస్థాన్‌లో వైమానిక దాడులు, 25 మంది ఉగ్రవాదులు మృతి

ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వ దళాలు ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు జరిపాయి. తాలిబాన్ అధిపత్య ప్రాంతాల్లో జరిగిన ఈ దాడుల్లో 25 మంది మృతి చెందారు. తాలిబాన్ కమాండర్ ముల్లా రహ్మతుల్లా కూడా ఈ దాడుల్లో చనిపోయినట్లు తెలుస్తోంది.
హెల్మాండ్ ప్రాంతంలో కొంత కాలంగా ప్రభుత్వ సైన్యం, తాలిబాన్ మధ్య పోరాటం జరుగుతోంది. కాందహార్ , జాబుల్, ఉర్గన్ ప్రాంతాలపై పట్టుసాధించేందుకు తాలిబాన్ ప్రయత్నిస్తుండగా ప్రభుత్వ సైన్యం తిప్పికొడుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com