బహ్రెయిన్లో డొమెస్టిక్ వర్కర్ కు 5 ఏళ్ల జైలు, భారీ జరిమానా..!!
- July 29, 2026
మనామా: బహ్రెయిన్లో మనీలాండరింగ్ కేసులో ఓ ఆసియా దేశానికి చెందిన డొమెస్టిక్ వర్కర్ కు కోర్టు కఠిన శిక్ష విధించింది. 30 ఏళ్ల మహిళకు 5 సంవత్సరాల జైలు శిక్ష, BD100,000 జరిమానా విధించడంతో పాటు శిక్ష పూర్తయిన అనంతరం దేశం నుంచి బహిష్కరించాలని ఫస్ట్ హై క్రిమినల్ కోర్టు ఆదేశించింది.
కోర్టు తీర్పు ప్రకారం, నేరానికి సంబంధించిన BD22,250 మొత్తాన్ని ఆమె ఆస్తులు లేదా నిధుల నుంచి స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. అలాగే ఆమె బ్యాంకు, ఆర్థిక ఖాతాల్లో ఉన్న BD775.810ను బాధితుడికి తిరిగి చెల్లించాలని సూచించింది.
డిజిటల్ సైన్ దుర్వినియోగం, తప్పుడు సమాచారం సమర్పించడం, ఐటీ వ్యవస్థలో అనధికార ప్రవేశం ద్వారా అక్రమంగా సంపాదించిన డబ్బును మనీలాండరింగ్ చేసినట్లు ఆమెపై అభియోగాలు నమోదయ్యాయి.
కోర్టు పత్రాల ప్రకారం, 2025 సెప్టెంబర్ 6 నుంచి అక్టోబర్ 22 మధ్య ఈ నేరాలు జరిగాయి. అక్రమంగా పొందిన డబ్బును స్థానిక, అంతర్జాతీయ లావాదేవీల ద్వారా బదిలీ చేసి, ఆ నిధుల అసలు మూలాన్ని దాచిపెట్టేందుకు ఆమె ప్రయత్నించినట్లు విచారణలో తేలింది.
తాజా వార్తలు
- పోస్టల్ సేవలపై జీఎస్టీ తొలగించాలి..కేంద్రాన్ని కోరిన ఎంపీ బాలశౌరి
- యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభలో ఆమోదం..లీక్ పాల్పడితే పదేళ్ల జైలు..రూ.10 కోట్ల జరిమానా!
- ఆగస్టు 1 నుంచి మారనున్న స్పీడ్ పోస్ట్ ఛార్జీలు..పూర్తి వివరాలు ఇవే!
- తైవాన్ పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం
- బహ్రెయిన్లో డొమెస్టిక్ వర్కర్ కు 5 ఏళ్ల జైలు, భారీ జరిమానా..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో స్పెయిన్ ప్రధాని చర్చలు..!!
- ఖతార్లో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యానికి ప్రత్యేక క్లినిక్..!!
- ధోఫార్లోని వాడి జర్జీజ్లో వ్యక్తిని రక్షించిన సివిల్ డిఫెన్స్..!!
- కువైట్లో కొత్త ఫ్రీలాన్స్ వ్యాపార లైసెన్సుల జారీ నిలిపివేత..!!
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టులపై నిపుణుల వార్నింగ్..!!







