ప్రపంచ ఇంటెలిజెంట్ సిటీస్ జాబితాలో దోహా..!!
- July 30, 2026
దోహా: ప్రపంచంలోని అత్యంత ఇంటెలిజెంట్ నగరాల జాబితాలో దోహా నగరం చోటు దక్కించుకుంది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG) విడుదల చేసిన తొలి ఇంటెలిజెంట్ సిటీస్ ఇండెక్స్–2026లో దోహా "ఎమర్జింగ్ మెచ్యూరిటీ" విభాగంలో స్థానం సంపాదించింది. 39 దేశాలకు చెందిన 61 ప్రధాన నగరాలపై నిర్వహించిన ఈ అధ్యయనంలో ఏఐ, డిజిటల్ సాంకేతికతలను ప్రజా సేవలు, ఆర్థికాభివృద్ధి, జీవన నాణ్యత మెరుగుదలకు నగరాలు ఎలా వినియోగిస్తున్నాయనే అంశాలను పరిశీలించారు.
నివేదిక ప్రకారం నగరాల పనితీరును ఫలితాలు (Outcomes), వ్యూహం (Strategy), సాంకేతిక వినియోగం (Adoption), పనితీరు విధానాలు (Ways of Working), మౌలిక వసతులు (Enablers) అనే ఐదు కీలక అంశాల ఆధారంగా అంచనా వేశారు. ఈ ప్రమాణాల ప్రకారం నగరాలను లీడింగ్, యాక్సిలరేటింగ్, ఎమర్జింగ్, డెవలపింగ్ అనే నాలుగు విభాగాలుగా వర్గీకరించారు.
ఈ ర్యాంకింగ్లో లండన్ అగ్రస్థానంలో నిలవగా, దుబాయ్ రెండో స్థానం దక్కించుకుంది. అనంతరం న్యూయార్క్, వాషింగ్టన్, ఆమ్స్టర్డామ్ స్థానాలు దక్కించుకున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ సిటీ సేవలు, AI ఆధారిత పరిష్కారాల అమలులో దుబాయ్ ప్రపంచంలోనే నంబర్–1గా నిలిచినట్లు నివేదిక వెల్లడించింది. అబుదాబి, రియాద్ నగరాలు యాక్సిలరేటింగ్ విభాగంలో చోటు సంపాదించాయి.
దోహా నగరం టోక్యో, హాంకాంగ్, మదీనా వంటి నగరాలతో కలిసి ఎమర్జింగ్ విభాగంలో నిలిచింది. AI వినియోగం పెరిగిన నగరాల్లో ప్రజల జీవన నాణ్యత కూడా మెరుగ్గా ఉంటుందని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా మిడిలీస్టు, ఆసియా దేశాల ప్రజలు జనరేటివ్ AI వినియోగంపై అధిక ఆసక్తి, విశ్వాసం కనబరుస్తున్నట్లు వెల్లడించింది.
సాంకేతికత మాత్రమే కాకుండా ప్రతిభావంతులైన హ్యూమన్ రీసోర్స్, ఆవిష్కరణలకు అనుకూల వాతావరణం, ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యాలు, బలమైన డిజిటల్ మౌలిక వసతులు కూడా నగరాల అభివృద్ధికి కీలకమని నివేదిక స్పష్టం చేసింది. ప్రభుత్వ సేవల్లో AI వినియోగాన్ని మరింత విస్తరించడం, డిజిటల్ పాలనను బలోపేతం చేయడం ద్వారా దోహా వంటి నగరాలు మరింత ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశముందని నివేదిక సూచించింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్లో ఆలీ వాక్వేకు కొత్త రూపు..!!
- ఖతార్లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్వేస్తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు







