మెసైమీర్ ఇంటర్‌చేంజ్ టన్నెల్‌ తాత్కాలికంగా మూసివేత..!!

- July 31, 2026 , by Maagulf
మెసైమీర్ ఇంటర్‌చేంజ్ టన్నెల్‌ తాత్కాలికంగా మూసివేత..!!

దోహా: ఖతార్‌లోని మెసైమీర్ ఇంటర్‌చేంజ్ (ఎగ్జిట్–33) వద్ద ఉన్న టన్నెల్‌ను నిర్వహణ పనుల నేపథ్యంలో ఈ వారాంతంలో తాత్కాలికంగా మూసివేయనున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఓఐ) ప్రకటించింది.

మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, జూలై 31 (శుక్రవారం) తెల్లవారుజామున 2 గంటల నుంచి 10 గంటల వరకు, అలాగే ఆగస్టు 1 (శనివారం) తెల్లవారుజామున 2 గంటల నుంచి 7 గంటల వరకు టన్నెల్‌లో వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు.
ఈ నేపథ్యంలో వాహనదారులు తమ ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని, వీలైనంత వరకు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని అధికారులు సూచించారు. ట్రాఫిక్ సూచికలు, పోలీసుల ఆదేశాలను పాటించడం ద్వారా ట్రాఫిక్ రద్దీని నివారించి సురక్షిత ప్రయాణానికి సహకరించాలని ఎంఓఐ విజ్ఞప్తి చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com