గవర్నర్ నరసింహన్ నివాసంలో ఎట్ హోం కార్యక్రమం..
- August 15, 2016
స్వాత్రంత్యం దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లో నిర్వహించే కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరుకాబోతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా హాజరవుతారని అధికారవర్గాలు తెలిపాయి. అయితే జెండా పండుగ ఇద్దరు సీఎంలను మరోసారి కలుపబోతోంది. గవర్నర్ నరసింహన్ నివాసంలో సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎట్ హోం కార్యక్రమం జరగబోతోంది. సీఎంలతో పాటు ఇతర అధికారులను గవర్నర్ తేనేటి విందుకు ఆహ్వానించారు. ఇద్దరు చంద్రులు కలుస్తున్నారంటేనే ఆసక్తి కలుగుతోంది. సీఎం చంద్రబాబు విజయవాడ నుంచి పరిపాలన కొనసాగిస్తున్నారు. తెలంగాణ నుంచి కేసీఆర్ పరిపాలన కొనసాగిస్తున్నారు. అయితే ఇద్దరు సీఎంలు ఒకటి రెండు సార్లు మాత్రమే కలుసుకున్నారు. కలుసుకున్న పరిపాలన వ్యవహారాల గురించి చర్చించుకున్న సందర్భాలు లేవు. మరోసారి వీరిద్దరు కలయికకు రాజభవన్ వేదిక కాబోతోంది. రాజ్భవన్ నిర్వహించే ఎట్ హోం కార్యక్రమంలో చంద్రబాబు కేవలం 25 నిమిషాలు మాత్రమే ఉంటారు. చంద్రబాబు వచ్చేసరికి సీఎం కేసీఆర్ అక్కడికి చేరుకుంటారా లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి. అయితే ఈ కొద్దిపాటి సమయంలో ఇద్దరు చంద్రులు కరచాలనం చేసుకుంటారని తెలుస్తోంది. ఇద్దరు సీఎంల మధ్య చర్చల కోసం ఇటీవల గవర్నర్ గట్టిగానే ప్రయత్నాలు చేశారు. అమరావతి వెళ్లి రాయబారం నడిపాడు. ఇప్పుడు ఇద్దరు కలుస్తున్నారు కాబట్టి రెండు రాష్ట్రాల వ్యవహరాల గురించి చర్చించుకుంటారా లేక పలకరింపులతోనే సరిపెట్టుకుంటారా అనేది ఆసక్తిగా మారబోతోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







