ఆగస్టు 15 నుంచి ఖతార్లో కనాద్ చేపల వేటపై నిషేధం..!!
- August 04, 2026
దోహా: ఖతార్లో కనాద్ (కింగ్ఫిష్) చేపల సంరక్షణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది అమలు చేసే వార్షిక నిషేధంలో భాగంగా ఈసారి ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 31 వరకు కనాద్ చేపల వేటపై ఆంక్షలు అమల్లో ఉంటాయని మునిసిపాలిటీ మంత్రిత్వశాఖ పరిధిలోని మత్స్యశాఖ ప్రకటించింది.
ఈ నిషేధ కాలంలో మన్సాబ్ నెట్లు ఉపయోగించి కనాద్ చేపల వేట చేపట్టడం పూర్తిగా నిషేధం. అలాగే ఈ నెట్లను రవాణా చేయడం, కొనుగోలు, విక్రయించడం కూడా అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. అయితే, హుక్ అండ్ లైన్ (గాలం) పద్ధతిలో కనాద్ చేపల వేటకు మాత్రం అనుమతి కొనసాగుతుందని మత్స్యశాఖ వెల్లడించింది.
సముద్ర జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం, కనాద్ చేపల నిల్వలను పెంపొందించడం, సముద్ర వనరుల సుస్థిర వినియోగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ వార్షిక నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కాగా, 2025లో ఖతార్లో కనాద్ చేపల ఉత్పత్తి సుమారు 3,484 టన్నులకు చేరిందని మునిసిపాలిటీ మంత్రిత్వశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- 17 రోజుల్లో 839 మంది అరెస్ట్.. 280 మిలియన్ డాలర్ల ఆస్తుల సీజ్..!!
- ఎయిర్ ఇండియా విమానం ఆలస్యం.. 9 ఏళ్ల న్యాయ పోరాటం తర్వాత కేరళ ప్రవాసికి రూ.1.36 లక్షల పరిహారం
- కువైట్లో బ్యాంక్ కార్డుల వినియోగం జోరు..!!
- నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామి వారిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు దంపతులు
- గ్లోబల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్లో రియాద్కు చోటు..!!
- రష్యా, పాకిస్తాన్లో ఉగ్రదాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- ఆగస్టు 15 నుంచి ఖతార్లో కనాద్ చేపల వేటపై నిషేధం..!!
- 2035 నాటికి 33 శాతం ఉద్గారాల తగ్గింపే లక్ష్యం..!!
- తైపే–హైదరాబాద్–దుబాయ్ కార్గోకు ఎమిరేట్స్ స్కైకార్గో ప్రత్యేక బోయింగ్ 777 ఫ్రైటర్ సేవలు
- ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు







