రష్యా, పాకిస్తాన్లో ఉగ్రదాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- August 04, 2026
మనామా: రష్యా, పాకిస్తాన్లో జరిగిన రెండు వేర్వేరు ఉగ్రదాడులను బహ్రెయిన్ తీవ్రంగా ఖండించింది. అమాయక ప్రజలు, భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడులు అత్యంత హేయమైనవని బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
రష్యా రాజధాని మాస్కోలోని కుద్రిన్స్కయా స్క్వేర్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్లో అమర్చిన ఐఈడీ పేలడంతో పలువురు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. అలాగే, పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో ఓ పోలీస్ స్టేషన్ను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు.
ఈ రెండు ఘటనలపై బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేసింది. ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది.
ప్రపంచ శాంతి, భద్రతకు ముప్పుగా నిలిచే అన్ని రకాల ఉగ్రవాదాన్ని బహ్రెయిన్ పూర్తిగా వ్యతిరేకిస్తుందని, ఇటువంటి హింసాత్మక ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించబోదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- 17 రోజుల్లో 839 మంది అరెస్ట్.. 280 మిలియన్ డాలర్ల ఆస్తుల సీజ్..!!
- ఎయిర్ ఇండియా విమానం ఆలస్యం.. 9 ఏళ్ల న్యాయ పోరాటం తర్వాత కేరళ ప్రవాసికి రూ.1.36 లక్షల పరిహారం
- కువైట్లో బ్యాంక్ కార్డుల వినియోగం జోరు..!!
- నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామి వారిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు దంపతులు
- గ్లోబల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్లో రియాద్కు చోటు..!!
- రష్యా, పాకిస్తాన్లో ఉగ్రదాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- ఆగస్టు 15 నుంచి ఖతార్లో కనాద్ చేపల వేటపై నిషేధం..!!
- 2035 నాటికి 33 శాతం ఉద్గారాల తగ్గింపే లక్ష్యం..!!
- తైపే–హైదరాబాద్–దుబాయ్ కార్గోకు ఎమిరేట్స్ స్కైకార్గో ప్రత్యేక బోయింగ్ 777 ఫ్రైటర్ సేవలు
- ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు







