ప్రిక్వార్టర్స్‌లో సింధు...

- August 15, 2016 , by Maagulf
ప్రిక్వార్టర్స్‌లో సింధు...

 బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌లో భారత షట్లర్‌ పీవీ సింధు దూసుకెళ్తొంది. అద్భుత ప్రదర్శనతో క్వార్టర్స్‌కు చేరింది. ప్రిక్వార్టర్స్‌లో సింధు చైనీస్‌ తైపీకి చెందిన థాయ్‌ జూ యింగ్‌పై 21-13, 21-15తో వరుస సెట్లలో విజయం సాధించింది. మొదటి సెట్‌లో 12-12తో సమానంగా ఉన్న సమయంలో సింధు.. ఒక్క సారిగా పుంజుకొని తొలి సెట్‌ను 21-13తో ముగించింది. అనంతరం రెండో సెట్‌లోనూ అదే ఫామ్‌ను కొనసాగించింది. ఇప్పటికే పురుషుల సింగిల్స్‌లో కిందాబి శ్రీకాంత్‌ సైతం క్వార్టర్స్‌కు చేరిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com