కువైట్లో 48 మంది రెసిడెన్సీ ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- August 07, 2026
కువైట్ : కువైట్లో రెసిడెన్సీ, కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వారిపై అధికారులు చర్యలు చేపట్టారు. ప్రత్యేక తనిఖీల్లో 48 మందిని అరెస్టు చేశారు. క్రిమినల్ సెక్యూరిటీ విభాగం, పబ్లిక్ అథారిటీ ఫర్ మాన్పవర్ సంయుక్తంగా షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Interior) వెల్లడించింది.
ఈ తనిఖీల్లో మొత్తం 120 వాణిజ్య సంస్థలను పరిశీలించినట్లు తెలిపింది. అరెస్టయిన వారిలో ఆర్టికల్-20 కింద 9 మంది, ఆర్టికల్-18 కింద 36 మంది, ఆర్టికల్-22 కింద ఒకరు ఉన్నారు. అలాగే ఆర్టికల్-18 కింద నమోదు చేసిన నకిలీ కంపెనీకి సంబంధించిన కేసులో అరెస్ట్ వారెంట్ ఉన్న మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొంది.
అరెస్టు చేసిన వారందరిపై చట్టపరమైన, పరిపాలనా చర్యలు ప్రారంభించి, తదుపరి విచారణ కోసం సంబంధిత అధికారులకు అప్పగించినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది.
రెసిడెన్సీ, కార్మిక చట్టాల అమలును మరింత కట్టుదిట్టం చేసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇలాంటి తనిఖీ కార్యక్రమాలను కొనసాగుతాయని కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- యూఏఈ–రష్యా అధ్యక్షుల ఫోన్ సంభాషణ.. ద్వైపాక్షిక సహకారం, మిడిల్ ఈస్ట్ పరిణామాలపై చర్చ
- పీఎం-జన్ మన్ కింద 2,498 అంగన్వాడీ కేంద్రాలకు ఆమోదం: ఎంపీ బాలశౌరి
- తిరుమలలో సీనియర్ సిటిజన్స్ కు దర్శన వివరాలు
- లండన్లో చిన్నారులతో యూఏఈ అధ్యక్షుడు, దుబాయ్ రూలర్
- వేసవిలో ఆహార భద్రతపై ఖతార్ ఆరోగ్య శాఖ కీలక సూచనలు..!!
- పారిశుద్ధ్య కార్మికులను మోసగించిన మేనేజర్కు జైలు శిక్ష ఖరారు..!!
- కువైట్లో 48 మంది రెసిడెన్సీ ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- ఎండ్ ఆఫ్ సర్వీస్ ప్రయోజనాల చెల్లింపులపై ఒమాన్ కీలక ఆదేశాలు..!!
- జిన్సెంగ్ కాఫీ, చాక్లెట్ ఉత్పత్తులపై సౌదీ హెచ్చరిక..!!
- యూఏఈ ఆగస్టు లాంగ్ వీకెండ్కు సలాలా ఫస్ట్ ఛాయిస్..!!







