ఖతార్లో విదేశీ పెట్టుబడులు భారీగా పెరుగుదల..!!
- August 10, 2026
దోహా: ఖతార్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) 2026 తొలి త్రైమాసికంలో గణనీయంగా పెరిగాయి. జనవరి నుంచి మార్చి వరకు దేశంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 172.2 బిలియన్ కతారీ రియాల్స్కు చేరాయి. 2025 నాలుగో త్రైమాసికంతో పోలిస్తే ఇది 3.3 శాతం వృద్ధి అని నేషనల్ ప్లానింగ్ కౌన్సిల్ (ఎన్పీసీ) వెల్లడించింది.
ఖతార్ సెంట్రల్ బ్యాంక్ సహకారంతో నిర్వహించిన ఎఫ్డీఐ సర్వేలో ఈ మేరకు వివరాలు వెల్లడయ్యాయి. దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో మైనింగ్, క్వారీయింగ్ రంగం అత్యధికంగా 45.3 శాతం వాటాను కలిగి ఉంది. ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాలు 31.9 శాతం, తయారీ రంగం 13 శాతం, సమాచారం-కమ్యూనికేషన్ రంగం 2.8 శాతం, ప్రొఫెషనల్, సైంటిఫిక్, టెక్నికల్ కార్యకలాపాలు 2 శాతం వాటాను కలిగి ఉన్నాయి.
విదేశీ పెట్టుబడుల పరిమాణంతో పాటు వాటి నాణ్యత, ఆర్థిక వైవిధ్యీకరణ, ఉత్పాదకత పెంపు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, అధిక విలువ కలిగిన రంగాల అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నట్లు ఎన్పీసీ సెక్రటరీ జనరల్ డాక్టర్ అబ్దులజీజ్ బిన్ నాసర్ బిన్ ముబారక్ అల్ ఖలీఫా తెలిపారు. చమురు, గ్యాస్ రంగాలకు వెలుపల పెట్టుబడులను మరింత పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.
విదేశాల్లోనూ పెరిగిన కతారీ పెట్టుబడులు
ఇదిలా ఉండగా, విదేశాల్లో కతార్కు చెందిన సంస్థలు, పెట్టుబడిదారులు చేసిన ప్రత్యక్ష పెట్టుబడులు కూడా పెరిగాయి. 2025 నాలుగో త్రైమాసికంతో పోలిస్తే 2026 తొలి త్రైమాసికంలో 3.5 శాతం పెరిగి 221.7 బిలియన్ కతారీ రియాల్స్కు చేరాయి. విదేశాల్లోని ఖతారీ పెట్టుబడుల్లో ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగం 33.5 శాతంతో అగ్రస్థానంలో ఉంది. మైనింగ్, క్వారీయింగ్ 29.8 శాతం, సమాచారం-కమ్యూనికేషన్ 10.8 శాతం, వసతి-ఆహార సేవలు 9.1 శాతం, రవాణా-నిల్వ రంగాలు 7 శాతం వాటాను కలిగి ఉన్నాయి.
ఖతార్ ఆర్థిక వ్యవస్థను మరింత వైవిధ్యపరచడం, అంతర్జాతీయ పెట్టుబడి భాగస్వామ్యాలను విస్తరించడం, దీర్ఘకాలిక ఆర్థిక రాబడులను పెంచడం ఈ పెట్టుబడుల ప్రధాన లక్ష్యాలుగా ఎన్పీసీ పేర్కొంది. 2026 తొలి త్రైమాసిక ఎఫ్డీఐ గణాంకాలు సుమారు 210 సంస్థల నుంచి సేకరించిన సమాచారంపై ఆధారపడి రూపొందించిన ప్రాథమిక అంచనాలని ఎన్పీసీ తెలిపింది.
తాజా వార్తలు
- భారతీయ పర్యాటకులకు ఉచిత యూఏఈ వీసా..అబుదాబి కొత్త హాలిడే ఆఫర్
- టీటీఈలకు బాడీ కెమెరాలు: రైల్వేలో కొత్త శకం
- ఆన్లైన్లో ఈ పనులు చేస్తే జైలుశిక్ష.. Dh500,000 ఫైన్..!!
- నిబంధనలు ఉల్లంఘించిన కార్ల డీలర్కు భారీ జరిమానా.. లైసెన్స్ సస్పెన్షన్..!!
- రసాయన పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలపై సీడీఏఏ భద్రతా సూచనలు..!!
- ‘రిపోర్ట్ మీ’ ఫిర్యాదుల వివరాలు గోప్యమే.. పీఏఎం హామీ..!!
- ఘనంగా హాంగ్కాంగ్లో 27వ కార్గిల్ విజయ్ దివస్
- ఉదయం 7 గంటలకు ముందు.. రాత్రి 8 తర్వాత డ్రిల్లింగ్కు నో..!!
- ఖతార్లో విదేశీ పెట్టుబడులు భారీగా పెరుగుదల..!!
- బహ్రెయిన్–యూఏఈ మధ్య ‘వన్ స్టాప్’ ఎయిర్ ట్రావెల్ సిస్టమ్..







