కార్ల అద్దాలకు 50 శాతం వరకు టింట్‌ అనుమతించాలని ప్రతిపాదన..!!

- August 11, 2026 , by Maagulf
కార్ల అద్దాలకు 50 శాతం వరకు టింట్‌ అనుమతించాలని ప్రతిపాదన..!!

మనామా: బహ్రెయిన్‌లో వాహనదారులకు ఎండ వేడి నుంచి ఉపశమనం కల్పించేందుకు కార్ల అద్దాలకు గరిష్ఠంగా  50 శాతం వరకు టింట్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఎంపీ హమద్ అల్ దోయ్ ప్రతిపాదించారు. ప్రస్తుతం ఉన్న టింటింగ్ పరిమితిని పెంచే అంశంపై అధ్యయనం చేపట్టాలని ఆయన ప్రతిపాదనలో కోరారు. బహ్రెయిన్‌లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా వాహనాల లోపల వేడి పెరుగుతోందని, అద్దాలకు టింట్ వేయడం ద్వారా నేరుగా పడే సూర్యకిరణాలను తగ్గించి క్యాబిన్‌లో ఉష్ణోగ్రతను కొంత నియంత్రించవచ్చని పేర్కొన్నారు.

ఇప్పటికే కొన్ని గల్ఫ్ దేశాల్లో భద్రత, ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా అధిక స్థాయి విండో టింటింగ్‌కు అనుమతి ఉందని ప్రతిపాదనలో ప్రస్తావించారు.టింటింగ్ పరిమితిని 50 శాతానికి పెంచితే డ్రైవర్లు, ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం లభించడంతో పాటు, వాహనాల్లో ఎయిర్ కండిషనింగ్‌ను పూర్తి సామర్థ్యంతో వినియోగించాల్సిన అవసరం తగ్గుతుందని అల్ దోయ్ తెలిపారు. అయితే వాహనదారుల సౌకర్యంతో పాటు భద్రత, రహదారి నిబంధనలను సమతుల్యం చేసే విధంగా కొత్త నిబంధనలను రూపొందించాలని ఆయన ప్రతిపాదించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com