భారత్‌-యూఏఈ ప్రయాణికులకు అలర్ట్‌..!!

- August 11, 2026 , by Maagulf
భారత్‌-యూఏఈ ప్రయాణికులకు అలర్ట్‌..!!

దుబాయ్‌: భారత స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15 సందర్భంగా దేశంలోని విమానాశ్రయాల్లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయనున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌ నుంచి యూఏఈకి రాకపోకలు సాగించే ప్రయాణికులు విమానాశ్రయాలకు ముందుగానే చేరుకోవాలని ఎయిర్‌ ఇండియా, స్పైస్‌జెట్‌ సూచించాయి. ఆగస్టు 15 వేడుకల నేపథ్యంలో అదనపు భద్రతా తనిఖీలు అమలు కానుండటంతో చెక్‌-ఇన్‌, సెక్యూరిటీ స్క్రీనింగ్‌, ఇతర విమానాశ్రయ ప్రక్రియలకు సాధారణం కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని రెండు విమానయాన సంస్థలు తెలిపాయి.

ఎయిర్‌ ఇండియా ప్రయాణికులకు సూచన

ఆగస్టు 10 నుంచి 20మధ్య ప్రయాణించే ప్రయాణికులు తమ షెడ్యూల్‌ బయలుదేరే సమయానికి చాలా ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవాలని ఎయిర్‌ ఇండియా సూచించింది. అదనపు భద్రతా తనిఖీలు, విమానాశ్రయ అధికారిక ప్రక్రియలకు అదనపు సమయం కేటాయించుకోవాలని తెలిపింది. ప్రయాణం సాఫీగా సాగేందుకు ముందస్తు ప్రణాళిక చేసుకోవాలని పేర్కొంది.

స్పైస్‌జెట్‌

స్పైస్‌జెట్‌ కూడా ఆగస్టు 11 నుంచి 20 వరకు ప్రయాణించే ప్రయాణికులకు ఇదే తరహా సూచనలు జారీ చేసింది. ఈ తేదీల్లో విమానాశ్రయాల్లో భద్రతా తనిఖీలకు అదనపు సమయం పట్టే అవకాశం ఉన్నందున ప్రయాణికులు ముందుగానే చేరుకోవాలని తెలిపింది. చెక్‌-ఇన్‌, సెక్యూరిటీ, ఇతర విమానాశ్రయ ప్రక్రియల కోసం తగినంత సమయం కేటాయించుకోవాలని సూచించింది.

భారీగా ప్రయాణాలు

యూఏఈలో భారతీయులు అతిపెద్ద ప్రవాస జనాభాగా ఉన్నారు. జూలై, ఆగస్టు నెలల్లో పాఠశాలలకు వేసవి సెలవులు ఉండటంతో అనేక మంది భారతీయులు కుటుంబ సభ్యులను కలిసేందుకు స్వదేశానికి వెళ్తుంటారు.సెలవులు ముగియడంతో ఆగస్టు రెండో, మూడో వారాల్లో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు తిరిగి యూఏఈకి వచ్చే అవకాశం ఉంది. దీంతో భారత్‌-యూఏఈ విమాన మార్గాల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది.

కీలక సూచనలు

ఆగస్టు 10 నుంచి 20 మధ్య భారత్‌ ప్రయాణం చేసే యూఏఈ నివాసితులు విమానాశ్రయాల్లో అదనపు సమయాన్ని కేటాయించుకోవాలని సూచించారు. ముఖ్యంగా చెక్‌-ఇన్‌, భద్రతా తనిఖీలు, ఇతర అధికారిక ప్రక్రియల్లో ఆలస్యం జరిగే అవకాశం ఉన్నందున ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవడం మంచిదని విమానయాన సంస్థలు పేర్కొన్నాయి. 

యూఏఈ విమానాశ్రయాల ద్వారా భారత నగరాలకు కనెక్టింగ్‌ విమానాల్లో ప్రయాణించే వారు కూడా తమ విమానయాన సంస్థల నుంచి తాజా సూచనలను తెలుసుకోవాలని, బయలుదేరే విమానాశ్రయంతో పాటు చేరుకునే విమానాశ్రయంలోనూ అదనపు సమయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఎయిర్ లైన్స్ అధికారులు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com