సలాలాలో ఫుడ్ సెక్యూరిటీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- August 12, 2026
సలాలా: ఒమన్లోని సలాలా ఇట్టీన్ ప్రాంతంలో ఫుడ్ సెక్యూరిటీ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో వ్యవసాయం, పశుసంవర్ధక, మత్స్య పరిశ్రమ, ఆహార ఉత్పత్తులు, ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు, లాజిస్టిక్స్ సేవలు, ఆర్థిక, పెట్టుబడి రంగాలకు చెందిన సుమారు 100 సంస్థలు, కంపెనీలు, ప్రాజెక్టులు పాల్గొంటున్నాయి.
ధోఫార్ గవర్నర్ హెచ్హె సయ్యద్ మార్వాన్ తుర్కీ అల్ సయీద్ ముఖ్య అతిథిగా హాజప్రదర్శనను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ-ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రదర్శనలో ఆహార భద్రత రంగానికి సంబంధించిన వివిధ ఉత్పత్తులు, ప్రాజెక్టులు, సరికొత్త ఆవిష్కరణలను ప్రదర్శిస్తున్నారు. ఈ రంగంలో పనిచేస్తున్న సంస్థలు, కంపెనీలకు తమ కార్యకలాపాలను పరిచయం చేసుకునేందుకు ఇది వేదికగా నిలుస్తోంది.
ఎయీత లయతనలేయఅదే సమయంలో ఆయా సంస్థల మధ్య సహకారం, పెట్టుబడి అవకాశాలను పెంపొందించేందుకు ఎగ్జిబిషన్ దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు. వ్యవసాయం, మత్స్య, ఆహార పరిశ్రమలు తదితర రంగాల్లో ఆధునిక సాంకేతికతలు, పెట్టుబడులపై కూడా ఈ ప్రదర్శనలో దృష్టి సారిస్తున్నారు.
తాజా వార్తలు
- డా.ఈష్ సింఘాల్కు ఘన వీడ్కోలు.. కతార్లో భారతీయ సమాజానికి విశేష సేవలకు ప్రశంసలు
- కర్ణాటకలో గుట్కా, పాన్ మసాలా పై నిషేధం
- షార్జాలో మట్టితో నంబర్ ప్లేట్ దాచిన డ్రైవర్ అరెస్ట్..!!
- సౌదీలో భారీగా ఖాట్, హషీష్ స్వాధీనం.. 8 మంది అరెస్ట్..!!
- సలాలాలో ఫుడ్ సెక్యూరిటీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- కొవ్వొత్తి మంటతో రూమ్మేట్ మృతి.. మహిళకు ఏడాది జైలు..!!
- నాన్-హైడ్రోకార్బన్ రంగాల వృద్ధి..ఖతార్ ఆర్థిక వ్యవస్థకు బలం..!!
- శ్రీవారి దర్శనానికి వచ్చే విదేశీ భక్తులకు గుడ్న్యూస్..
- సింక్ఫీల్డ్ కప్లో ఆర్ ప్రజ్ఞానంద సంచలన విజయం
- చంద్రశేఖరన్ రిజైన్.. టాటా గ్రూప్ షేర్లు పతనం







