సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- August 13, 2026
మస్కట్: ఒమన్లోని సమైల్లో అల్ మహా పెట్రోలియం ప్రొడక్ట్స్ మార్కెటింగ్ కంపెనీకి చెందిన ఇంధన స్టేషన్లో ఓ వాహనంలో మంటలు చెలరేగాయి. మంటలు ఇంధన పంప్ వరకు వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే సంబంధిత అధికారులు మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు అల్ మహా సంస్థ తెలిపింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదని స్పష్టం చేసింది.
ప్రస్తుతం ఇంధన స్టేషన్ ప్రాంగణంలో క్లీనింగ్ పనులు కొనసాగుతున్నాయని సంస్థ పేర్కొంది. ఘటన కారణంగా జరిగిన నష్టంపై పూర్తి స్థాయి అంచనా వేస్తున్నట్లు తెలిపింది. స్టేషన్లో కార్యకలాపాలను సురక్షితంగా పునఃప్రారంభించేందుకు అవసరమైన అన్ని భద్రతా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది.
వచ్చే కొద్ది రోజుల్లో స్టేషన్లో సాధారణ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని అల్ మహా తెలిపింది. వినియోగదారులు, ఉద్యోగులు, సమాజ భద్రతే తమ సంస్థకు అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్







