ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!

- August 13, 2026 , by Maagulf
ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!

మనామా: అధికారిక ఎలక్ట్రానిక్ రికార్డుల్లో తప్పుడు సమాచారాన్ని నమోదు చేశారనే ఆరోపణలపై ఓ నిందితుడిని హై క్రిమినల్ కోర్టుకు విచారణ నిమిత్తం పబ్లిక్ ప్రాసిక్యూషన్ రిఫర్ చేసింది. ఆర్థిక నేరాలు, మనీలాండరింగ్ ప్రాసిక్యూషన్‌ వివరాల ప్రకారం.. నిందితుడు 14 మంది నుంచి బకాయిలు వసూలు చేసేందుకు దాఖలు చేసిన క్లెయిమ్‌లలో ఒక కేసులో, మరో తొమ్మిది మంది క్లెయిమ్‌లలో తప్పు మొబైల్ ఫోన్ నంబర్లను నమోదు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తులో ఈ వ్యక్తులందరికీ ఒకే రెండు మొబైల్ నంబర్లను నమోదు చేసినట్లు గుర్తించారు. ఆ రెండు నంబర్లు కూడా నిందితుడివేనని అధికారులు నిర్ధారించారు.

క్లెయిమ్‌లకు సంబంధించిన నోటిఫికేషన్లు బాధితులకు అందకుండా చేసి, వాటిపై స్పందించే అవకాశం లేకుండా చేసేందుకే నిందితుడు ఉద్దేశపూర్వకంగా తప్పుడు వివరాలను నమోదు చేసినట్లు ప్రాసిక్యూషన్ ఆరోపించింది. బాధితుల వాంగ్మూలాలు, సంబంధిత మంత్రిత్వ శాఖ ఉద్యోగి ఇచ్చిన సమాచారం, ఎలక్ట్రానిక్ వ్యవస్థ పరిశీలన ద్వారా దర్యాప్తు అధికారులు కీలక ఆధారాలను సేకరించారు. క్లెయిమ్‌లకు సంబంధించిన నోటిఫికేషన్ సందేశాలు నిందితుడికి చెందిన మొబైల్ నంబర్లకే వెళ్లినట్లు కూడా గుర్తించారు.

ఈ రెండు కేసులపై హై క్రిమినల్ కోర్టులో 2026 ఆగస్టు 18న విచారణ జరగనుంది. నిందితుడిపై అధికారిక ఎలక్ట్రానిక్ రికార్డులను తారుమారు చేసిన ఆరోపణలపై కోర్టు విచారణ చేపట్టనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com