బంగాళాఖాతంలో అల్పపీడనం..పలు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్..
- August 16, 2026
బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్–ఉత్తర ఒడిశా తీరానికి సమీపంలో నూతనంగా అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు తీవ్ర రూపం దాల్చనున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆగస్టు 17న భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు ప్రకటించారు. వాతావరణంలో సంభవిస్తున్న ఈ ఆకస్మిక మార్పుల పట్ల ప్రజలు, యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
ఉత్తరాది, తూర్పు రాష్ట్రాల్లో వర్షాల హోరు:
అల్పపీడనం కారణంగా ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో వర్ష(Monsoon Alert) తీవ్రత ఎక్కువగా ఉండనుంది. ఒడిశాలోని కొన్ని జిల్లాల్లో అత్యంత తీవ్ర వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయి. మరోవైపు హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కాశ్మీర్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లోనూ వర్షాలు ముంచెత్తనున్నాయి. హిమాచల్లోని 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. పంజాబ్, హర్యానా, ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి.
మధ్య, ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి:
మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, విదర్భ, గోవా ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ సహా ఈశాన్య రాష్ట్రాల్లోనూ వర్షాల ప్రభావం కొనసాగనుంది. ఇక దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా, రాజస్థాన్లో వర్షాల తీవ్రత తగ్గుముఖం పట్టి పొడి వాతావరణం నెలకొనే అవకాశముందని IMD స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్ సాలిక్ ఫైన్లు..ఏ తప్పుకు ఎంత జరిమానా? తప్పించుకోవడం ఎలా?
- మేడారంలో తులాభారం..సీఎం రేవంత్ బరువు ఎంతంటే?
- అనుమానాస్పద కదలికలను గుర్తించి పోలీసులకు సమాచారం.. నివాసితుడికి షార్జా పోలీసుల సత్కారం
- బంగాళాఖాతంలో అల్పపీడనం..పలు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్..
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు కీలక సూచనలు.. నిషేధిత, పరిమిత వస్తువుల పూర్తి జాబితా
- రియాద్లో ఘనంగా ‘ఇండియా ఉత్సవ్’..
- ఆగస్టు 31న ‘యాక్సిడెంట్-ఫ్రీ డే’..
- తెలంగాణ లో కొత్తగా TG SAFE
- అబుదాబి ఫాల్కన్ వేలం.. Dh250,000కు వైట్ ఫాల్కన్ సేల్..!!
- సౌదీ అరేబియాలో 89 శాతానికి గేమింగ్ లేటెన్సీ..!!







