కువైట్ లో డ్రగ్ రాకెట్ బస్ట్.. 7 కిలోల బంగారం, విలువైన వాచీలు స్వాధీనం..!!
- August 22, 2026
కువైట్ సిటీ: డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలకు సంబంధించిన కేసులో కువైట్ డ్రగ్ కంట్రోల్ అధికారులు ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మాదక, సైకోట్రోపిక్ పదార్థాలతో పాటు మద్యం స్వాధీనం చేసుకున్నట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అధికారుల ప్రకారం.. నిందితులు అక్రమంగా సంపాదించిన డబ్బును దాచిపెట్టి, దానితో బంగారం, ఖరీదైన వాచీల వంటి అధిక విలువైన ఆస్తులుగా మార్చినట్లు దర్యాప్తులో గుర్తించారు.
ఈ ఆపరేషన్లో నిందితుల వద్ద నుంచి KD 40,000 నగదుతోపాటు సుమారు KD 50,000 విలువైన 4 ఖరీదైన వాచీలు, సుమారు 7 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ముగ్గురు నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం, వాచీలు, డ్రగ్స్ తదితర వస్తువులను సంబంధిత అధికారులకు అప్పగించినట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ E1 సెటిల్మెంట్ నిలిపివేయాలి.. సౌదీతో పాటు 7 దేశాలు డిమాండ్..!!
- లుసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో ఫార్ములా-1 సందడి.. 100 రోజుల కౌంట్డౌన్..!!
- డీజిల్ చోరీ, టెలికాం టవర్ల ధ్వంసం.. నలుగురు భారతీయుల అరెస్ట్..!!
- అస్థిర వాతావరణం.. అబుదాబి, అల్ఐన్లో బీచ్లు, పార్కులు మూసివేత..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్లో పర్యావరణ ఉల్లంఘనలపై అధికారుల చర్యలు..!!
- కువైట్ లో డ్రగ్ రాకెట్ బస్ట్.. 7 కిలోల బంగారం, విలువైన వాచీలు స్వాధీనం..!!
- కొత్త విద్యా సంవత్సరం వేళ.. సౌదీలో స్కూల్ సప్లై దుకాణాల్లో తనిఖీలు..!!
- భారత కాన్సుల్ జనరల్కు GWAC 10వ ఆవిర్భావ దినోత్సవ ఆహ్వానం
- సౌదీ తబూక్లో భారతీయులతో కాన్సుల్ జనరల్ భేటీ..
- రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త.. జీబ్రా క్రాసింగ్లనే ఉపయోగించాలి: అబుదాబి పోలీసుల హెచ్చరిక







