ఫస్ట్, బిజినెస్ క్లాస్ టికెట్లపై రూమర్స్.. ఖండించిన కువైట్ ఎయిర్వేస్..!!
- August 24, 2026
కువైట్ : ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్లో బుక్ చేసుకున్న ప్రయాణికుల టికెట్లను ఎకానమీ క్లాస్కు మారుస్తున్నారన్న వార్తలను కువైట్ ఎయిర్వేస్ ఖండించింది. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. ఏదైనా ఆపరేషనల్ కారణాల వల్ల ప్రయాణికుడి బుకింగ్లో మార్పు చేయాల్సి వస్తే, నిర్ణీత విధానాల ప్రకారం పరిస్థితిని పరిష్కరిస్తామని ఎయిర్లైన్ తెలిపింది. అలాంటి సందర్భాల్లో ప్రయాణికులను నేరుగా సంప్రదించి పూర్తి సమాచారం అందిస్తామని పేర్కొంది. అలాగే అంతర్జాతీయ ప్రమాణాలు, నిబంధనల ప్రకారం ప్రయాణికులకు లభించాల్సిన పరిహారం సహా అన్ని హక్కులను కాపాడుతామని వెల్లడించింది.
ప్రయాణికులు బుక్ చేసుకున్న క్లాస్, ధృవీకరించిన బుకింగ్లకు కట్టుబడి ఉండటమే తమ సంస్థ విధానమని కువైట్ ఎయిర్వేస్ తెలిపింది. ప్రయాణికులకు అర్హమైన సేవలను అందించడంతో పాటు, అదనపు ఆర్థిక భారం లేదా ఇతర ఇబ్బందులు కలగకుండా చూస్తామని స్పష్టం చేసింది. తమ బుకింగ్లు, విమానాల వివరాలపై సమాచారం కోసం ప్రయాణికులు కువైట్ ఎయిర్వేస్ అధికారిక కమ్యూనికేషన్ ఛానళ్లను మాత్రమే ఉపయోగించాలని కువైట్ ఎయిర్వేస్ సూచించింది.
తాజా వార్తలు
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!
- జెడ్డాలో 1,480 మంది పౌరులకు భూమి పత్రాలు అందజేత..!!
- ఖతార్ సైంటిఫిక్ క్లబ్ ‘యంగ్ ఇన్వెంటర్స్’ ప్రారంభం..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు పసికందులు సజీవ దహనం
- ఫస్ట్, బిజినెస్ క్లాస్ టికెట్లపై రూమర్స్.. ఖండించిన కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీ దౌత్య శిక్షణ సంస్థ డీజీతో భారత రాయబారి విపుల్ భేటీ
- సీఎం రేవంత్ US టూర్ రద్దు..







