ఖతార్ సైంటిఫిక్ క్లబ్ ‘యంగ్ ఇన్వెంటర్స్’ ప్రారంభం..!!
- August 24, 2026
దోహా: ఖతార్ సైంటిఫిక్ క్లబ్ (QSC) ‘యంగ్ ఇన్వెంటర్స్’ కార్యక్రమం రెండో దశను ప్రారంభించింది. 2026లో దోహాలో జరిగిన వెబ్ సమ్మిట్ ఖతార్ సందర్భంగా క్రీడలు, యువజన మంత్రిత్వ శాఖ ప్రారంభించిన జాతీయ ప్రాజెక్టులో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 15 నుంచి 30 ఏళ్ల వయస్సు కలిగిన సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్పై ఆసక్తి ఉన్న యువతను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. మొదటి దశ ఆగస్టు 4న ముగియగా, ఇందులో ‘డిజైన్ థింకింగ్’ ప్రాథమిక అంశాలపై శిక్షణ ఇచ్చారు.
మూడు రోజుల పాటు జరిగే రెండో దశలో ‘ఇంజినీరింగ్ డిజైన్’పై దృష్టి సారిస్తున్నారు. యువత తమ ఆలోచనలు, ప్రాజెక్టులను మరింత అభివృద్ధి చేసి ప్రాక్టికల్ మోడళ్లుగా రూపొందించేందుకు ఈ దశలో మార్గనిర్దేశం చేస్తున్నారు. సృజనాత్మక ఆలోచనలను సాంకేతిక వివరాలతో కూడిన వాస్తవిక ఆవిష్కరణలుగా మార్చేందుకు దశలవారీగా శిక్షణ అందిస్తున్నారు.
ఈ నెలాఖరులో ప్రారంభం కానున్న మూడో, తుది దశలో ప్రాజెక్టుల అమలుపై దృష్టి పెట్టనున్నారు. అనంతరం ఎంపికైన విజేతల ప్రాజెక్టులను ప్రత్యేక న్యాయనిర్ణేతల బృందం ముందు ప్రదర్శించడంతో కార్యక్రమం ముగియనుంది. కాగా, QSC వేసవి శిబిరంలో నిర్వహించిన తొలి దశలో సృజనాత్మక ఆలోచనలు, ప్రాజెక్టు టైమ్లైన్ రూపకల్పన, సాధ్యాసాధ్యత అధ్యయనం, నిపుణుల సలహాలు వంటి అంశాలపై వర్క్షాప్లు నిర్వహించారు.
తాజా వార్తలు
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!
- జెడ్డాలో 1,480 మంది పౌరులకు భూమి పత్రాలు అందజేత..!!
- ఖతార్ సైంటిఫిక్ క్లబ్ ‘యంగ్ ఇన్వెంటర్స్’ ప్రారంభం..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు పసికందులు సజీవ దహనం
- ఫస్ట్, బిజినెస్ క్లాస్ టికెట్లపై రూమర్స్.. ఖండించిన కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీ దౌత్య శిక్షణ సంస్థ డీజీతో భారత రాయబారి విపుల్ భేటీ
- సీఎం రేవంత్ US టూర్ రద్దు..
- యూట్యూబ్కు పోటీగా చైనా ‘బిలిబిలి’ వచ్చేసింది..







