ఒమన్ లో భారత నర్సు హత్య కేసులో భర్త ప్రమేయం లేదని విడుదల

- August 18, 2016 , by Maagulf
ఒమన్ లో భారత నర్సు హత్య కేసులో భర్త ప్రమేయం లేదని  విడుదల

మస్క్యాట్: గత ఏప్రిల్ 21 వ  తేదీన ఒమన్ లో 25 ఏళ్ల భారతీయ నర్సు దారుణ హత్యకు గురైన కేసులో అనుమానితుడైన ఆమె భర్తని  నిర్బంధం నుండి విడుదల చెయ్యబడ్డారు.
ఎల్.టీ. తన భార్యను హత్య చేసినట్లుగా  అనుమానించడంతో  దాదాపు నాలుగు నెలల కాలంగా ఒమన్ జైలులో ఉండిపోయారు.తన భార్య హత్య చేసాడనడానికి  ఎటువంటి ఆధారం లభించకపోవడంతో   ఆ భర్తని  విడుదల చేస్తున్నట్లు  రాయల్ ఒమన్ పోలీస్ అధికారి " మా గల్ఫ్ డాట్ కామ్ " కి  తెలిపారు.  అయితే , ఆమెను చంపిన హంతకుడు గూర్చి ఇప్పటికీ పరిశోధన కొనసాగుతుందని,  అధికారికంగా  మరిన్నీ  వివరాలు ఇవ్వలేదని ఆ పొలిసు అధికారి పేర్కొన్నారు. హత్యకు గురైన నర్స్ చిక్కు  రాబర్ట్ (25)  దక్షిణ భారతదేశం లోని  కేరళ  రాష్ట్రం నుండి ఉద్యోగం నిమిత్తం వచ్చిన ఆమెను   ఏప్రిల్ 21 వ తేదీన ఒమాన్ లో  దక్షిణాన శలాలః ప్రావిన్స్ లో ఆమె నివాసంలో దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో ఎల్.టీ.  ప్రమేయం లేదని, తాను ఈ దారుణం చేయలేదని ఒప్పుకోవడం లేదని  ఒమన్ పోలీసులు నివేదించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com