హైదరాబాద్లో తాగి డ్రైవ్ చేస్తే తస్మాత్ జాగ్రత్త
- July 28, 2015
హైదరాబాదులో తప్పతాగి బండి నడిపారో ఇక అంతే సంగతులు. మద్యం తాగి వాహనాలు నడపడం ఎంత ప్రమాదకరమో అందరికీ తెలిసిందే. అలా మందుకొట్టి.. స్టీరింగ్ పట్టుకుని అభాగ్యుల ప్రాణాలతోపాటు తమ ప్రాణాలను సైతం గాలిలో కలిపేసే వారికి కొత్త శిక్ష అమలులోకి వచ్చింది. సాధారణంగా హైదరాబాదులో డ్రంక్ అండ్ డ్రైవ్ పక్కాగా చేపడుతున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వ్యక్తులను కోర్టులో హాజరుపరుస్తున్నారు. అలా దొరికిన మందుబాబులకు హైదరాబాదులోని ఎర్రమంజిల్ న్యాయస్థానం విభిన్న శిక్ష విధించింది. ఇప్పటిదాకా ఫైన్ కట్టేసి ఊపిరిపీల్చుకుంటున్న బడాబాబులకు ఎర్రమంజిల్ కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం రుచించికపోవచ్చు. ఇంతకీ ఆ శిక్ష ఏంటంటే..? మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడళ్ల వద్ద ట్రాఫిక్ నియంత్రణ విధులు నిర్వర్తించాలని మందుబాబులను ఆదేశించింది. హైదరాబాదులో ఇకపై మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే ఈ ప్రత్యేక విధులు నిర్వర్తించక తప్పదని స్పష్టం చేసింది. తాజాగా, ఎర్రమంజిల్ కోర్టు 35 మంది మందుబాబులకు ఈ తరహా సామాజిక సేవా శిక్ష విధించడం చర్చనీయాంశమైంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









