హైదరాబాద్లో తాగి డ్రైవ్ చేస్తే తస్మాత్ జాగ్రత్త
- July 28, 2015
హైదరాబాదులో తప్పతాగి బండి నడిపారో ఇక అంతే సంగతులు. మద్యం తాగి వాహనాలు నడపడం ఎంత ప్రమాదకరమో అందరికీ తెలిసిందే. అలా మందుకొట్టి.. స్టీరింగ్ పట్టుకుని అభాగ్యుల ప్రాణాలతోపాటు తమ ప్రాణాలను సైతం గాలిలో కలిపేసే వారికి కొత్త శిక్ష అమలులోకి వచ్చింది. సాధారణంగా హైదరాబాదులో డ్రంక్ అండ్ డ్రైవ్ పక్కాగా చేపడుతున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వ్యక్తులను కోర్టులో హాజరుపరుస్తున్నారు. అలా దొరికిన మందుబాబులకు హైదరాబాదులోని ఎర్రమంజిల్ న్యాయస్థానం విభిన్న శిక్ష విధించింది. ఇప్పటిదాకా ఫైన్ కట్టేసి ఊపిరిపీల్చుకుంటున్న బడాబాబులకు ఎర్రమంజిల్ కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం రుచించికపోవచ్చు. ఇంతకీ ఆ శిక్ష ఏంటంటే..? మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడళ్ల వద్ద ట్రాఫిక్ నియంత్రణ విధులు నిర్వర్తించాలని మందుబాబులను ఆదేశించింది. హైదరాబాదులో ఇకపై మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే ఈ ప్రత్యేక విధులు నిర్వర్తించక తప్పదని స్పష్టం చేసింది. తాజాగా, ఎర్రమంజిల్ కోర్టు 35 మంది మందుబాబులకు ఈ తరహా సామాజిక సేవా శిక్ష విధించడం చర్చనీయాంశమైంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







