ఇరాన్ నుండి బందీలను విడిపించుకునేందుకు రూ.2,600 కోట్లు కట్టిన అమెరికా
- August 18, 2016
ఇరాన్లో బందీలుగా పట్టుబడ్డ తమ దేశీయులను విడిపించుకునేందుకు దాదాపు రూ.2,600 కోట్లను అమెరికా చెల్లించిందంటూ ప్రముఖ వార్తాసంస్థ 'వాల్స్ట్రీట్ జర్నల్' సంచలనాత్మక కథనాన్ని వెలువరించింది. ఈ ఏడాది జనవరి 17న జెనీవా విమానాశ్రయంలో సదరు చెల్లింపు జరిగినట్లు పేర్కొంది. బందీలుగా ఉన్న ముగ్గురు అమెరికన్లు టెహ్రాన్ నుంచి విమానంలో బయలుదేరాకే అమెరికా అధికారులు ఇరాన్కు డబ్బు ముట్టజెప్పారని వివరించింది. దాన్ని బలపర్చేలా అధికారుల వివరణనూ ఉటంకించింది.
అయితే, ఇరాన్తో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఓ వివాదాన్ని పరిష్కరించుకునే యత్నాల్లో భాగంగానే తొలివిడతగా ఆ మొత్తం చెల్లించామని... బందీలను విడిపించుకునేందుకు కాదని ఒమామా ప్రభుత్వం తాజాగా నొక్కిచెప్పింది. ప్రభుత్వ వాదనను రిపబ్లికన్ నేషనల్ కమిటీ(ఆర్ఎన్సీ) ఛైర్మన్ రీన్స్ ప్రీబస్ తోసిపుచ్చారు. బందీలను విడిపించుకునేందుకే సదరు సొమ్ము ముట్టజెప్పినట్లు ప్రభుత్వం అంగీకరించాలని సూచించారు.
దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా తీసుకున్న నిర్ణయాన్ని హిల్లరీ క్లింటన్ గుడ్డిగా సమర్థించారని వ్యాఖ్యానించారు. తాజా కథనం అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డెమోక్రటిక్ పార్టీకి ఇబ్బందులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







