ఇరాన్ నుండి బందీలను విడిపించుకునేందుకు రూ.2,600 కోట్లు కట్టిన అమెరికా

- August 18, 2016 , by Maagulf
ఇరాన్ నుండి బందీలను విడిపించుకునేందుకు రూ.2,600 కోట్లు కట్టిన అమెరికా

ఇరాన్‌లో బందీలుగా పట్టుబడ్డ తమ దేశీయులను విడిపించుకునేందుకు దాదాపు రూ.2,600 కోట్లను అమెరికా చెల్లించిందంటూ ప్రముఖ వార్తాసంస్థ 'వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌' సంచలనాత్మక కథనాన్ని వెలువరించింది. ఈ ఏడాది జనవరి 17న జెనీవా విమానాశ్రయంలో సదరు చెల్లింపు జరిగినట్లు పేర్కొంది. బందీలుగా ఉన్న ముగ్గురు అమెరికన్లు టెహ్రాన్‌ నుంచి విమానంలో బయలుదేరాకే అమెరికా అధికారులు ఇరాన్‌కు డబ్బు ముట్టజెప్పారని వివరించింది. దాన్ని బలపర్చేలా అధికారుల వివరణనూ ఉటంకించింది.

అయితే, ఇరాన్‌తో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఓ వివాదాన్ని పరిష్కరించుకునే యత్నాల్లో భాగంగానే తొలివిడతగా ఆ మొత్తం చెల్లించామని... బందీలను విడిపించుకునేందుకు కాదని ఒమామా ప్రభుత్వం తాజాగా నొక్కిచెప్పింది. ప్రభుత్వ వాదనను రిపబ్లికన్‌ నేషనల్‌ కమిటీ(ఆర్‌ఎన్‌సీ) ఛైర్మన్‌ రీన్స్‌ ప్రీబస్‌ తోసిపుచ్చారు. బందీలను విడిపించుకునేందుకే సదరు సొమ్ము ముట్టజెప్పినట్లు ప్రభుత్వం అంగీకరించాలని సూచించారు.

దేశాధ్యక్షుడు బరాక్‌ ఒబామా తీసుకున్న నిర్ణయాన్ని హిల్లరీ క్లింటన్‌ గుడ్డిగా సమర్థించారని వ్యాఖ్యానించారు. తాజా కథనం అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డెమోక్రటిక్‌ పార్టీకి ఇబ్బందులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com